మహేష్బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా మే మొదటి వారంలో విడుదల కానుంది.
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా మార్చిలో షూటింగ్ పూర్తి కాగానే మహేష్ మరో సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్నాడు.
ఆ సినిమాకు ఇప్పటికే ‘బ్రహ్మోత్సవం’ అనే టైటిల్ను కూడా అనుకున్నారు.ప్రస్తుతం ఆ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమాకు కూడా మహేష్ కమిట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
మహేష్బాబు, పూరి కాంబినేషన్లో సినిమా కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
ఈ సంవత్సరం మహేష్బాబు మూడు సినిమాలను విడుదల చేసి తీరాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.గత కొన్ని సంవత్సరాలుగా ఒకటి రెండు సినిమాలతో మాత్రమే మహేష్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
కాని ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులను మురిపించాలని కోరుకుంటున్నాడు.అయితే మహేష్ ప్రయత్నం నెరవేరేనో లేదో చూడాలి.