చియాన్ విక్రమ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అపరిచితుడు.( Aparichitudu ) 2005లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.అప్పట్లోనే ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే టీవీలకు అతుక్కుని పోయి చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు.ఇది ఇలా ఉంటే ఎప్పటినుంచో ఈ సినిమా రీమేక్ పై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమా రీమేక్ పై స్పందించారు విక్రమ్.
( Vikram ) హిందీ వెర్షన్ రీమేక్లో రణ్వీర్సింగ్( Ranveer Singh ) నటించడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తంగలాన్( Thangalaan ) చిత్రం హిందీలో విడుదల సందర్భంగా ప్రస్తుతం ఆయన ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు.అపరిచితుడు రీమేక్ గురించి శంకర్కు( Shankar ) మాత్రమే తెలుసు.రీమేక్ నాతో ఎందుకు తీయడం లేదని ఆయన్నే అడగండి.
ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన చిత్రం.రణ్వీర్సింగ్ ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది.
ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన నటుల్లో రణ్వీర్ కూడా ఒకరు.ఆయన్ని అపరిచితుడు పాత్రలో చూడటం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
వీలైనంత త్వరగా ఈ సినిమా రీమేక్ చూడాలనుంది అని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా విక్రమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
20005 లో మొదలైన అపరిచితుడు సినిమా నిర్లక్ష్యం స్వార్థం అవినీతి వంటి విషయాల్లో ముక్కుసూటిగా ప్రశ్నించే సినిమా.ఈ సినిమా అప్పట్లో చాలామంది ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే.చాలామందిలో ఈ సినిమా మార్పును కూడా తెచ్చింది.2021లోనే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేశారు.రణ్వీర్ హీరోగా ఇది రానున్నట్లు శంకర్ అప్పట్లో శంకర్ ప్రకటించారు.పెన్ స్టూడియోస్ సంస్థలో జయంతిలాల్ గడ దీన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్లు చెప్పారు.అయితే, ఈ సినిమా నిర్మాత హిందీ రీమేక్కు సంబంధించిన ఆర్థిక అంశాలపై కోర్టును ఆశ్రయించారు.అప్పటినుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు.
మరోసారి ఈ సినిమా ప్రస్తావన తెరపైకి వచ్చింది కాబట్టి శంకర్ దీనిపై దృషి పెడతారేమో చూడాలి మరీ.