సాధారణంగా బీటెక్ డ్రాపౌట్ అయిన వ్యక్తులు భారీ మొత్తంలో సంపాదించడం సులువైన విషయం కాదు.అలాంటి వ్యక్తులు బిజినెస్ చేయాలన్నా ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు ఎదురవుతాయి.
అయితే అవినాష్ మేధా యువకుడు మాత్రం ఎంతో కష్టపడి తన లక్ష్యాన్ని సాధించారు.తన ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టి సక్సెస్ అయ్యాడు.
సంవత్సరం తిరగకుండానే ఆ యువకుడు లక్ష్యాన్ని సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు.ప్రపంచమంతా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం భయం నెలకొంది.
ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు సైతం అప్రకటిత లేఆఫ్ లను ప్రకటించడం ఒకింత సంచలనం అవుతోంది.బీటెక్, ఎంటెక్ చదివి మంచి మార్కులు సాధించినా కచ్చితంగా ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తై ఏళ్లు గడుస్తున్నా సరైన ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.19 ఏళ్ల వయస్సులోనే ఫ్రీడమ్ విత్ ఏఐతో డిజిటల్( Freedom with AI ) మార్కెటింగ్ విభాగాల్లో కంపెనీని స్థాపించారు.
తన కంపెనీతో ఏకంగా 35 మందికి ఉపాధి కల్పించడం ద్వారా అవినాష్ మేధా ప్రశంసలు అందుకుంటున్నారు.భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) దే అని భవిష్యత్తులో కంపెనీని వృద్ధిపథంలోకి నడిపిస్తానని ఆశభావం వ్యక్తం చేసి ప్రశంసలు అందుకున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో యువతలో నెలకొన్న భయాలను నివృత్తి చేస్తూ అవినాష్ మేధా ప్రశంసలు అందుకుంటున్నారు.భవిష్యత్తులో 10 కోట్ల మందికి కృత్తిమ మేధపై అవగాహన కల్పిస్తానని అవినాష్ మేధా ( Avinash Mada)పేర్కొన్నారు.
అవినాష్ మేధా సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా( Social media ) వేదికగా తెగ వైరల్ అవుతోంది.అవినాష్ మేధా ఈతరం యువతలో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.
అవినాశ్ సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.అవినాశ్ మేధా తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటూ ఎన్నో మెట్లు పైకి ఎదుగుతున్నారు.