కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం పదవిపై మనసులో మాట బయటపెట్టిన ఆయన వచ్చే పదేళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రిని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయదశమి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సీఎం అవుతానని చెప్పారు.
అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.అందుకే తన సతీమణిని పోటీకి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
తాను ఫోన్ లో అందుబాటులో ఉండకపోవచ్చన్న జగ్గారెడ్డి ఆపదలో ఉన్నవారికి తన భార్య అందుబాటులో ఉంటారని వెల్లడించారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించలేదన్నారు.
కానీ వచ్చే సంవత్సరం మాత్రం ఘనంగా నిర్వహిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.