పొన్నాల లక్ష్మయ్య పై రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ( Minister Ponnala Lakshmaiah )కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే.గత కొంతకాలం నుండి పార్టీ పట్ల అసంతృప్తి నేతగా సాగుతున్న ఆయన శుక్రవారం రాజీనామా చేయటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

 Revanth Reddy Serious Comments On Ponnala Lakshmaiya , Congress, Revanth Reddy,-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సమయంలో పొన్నాల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.పరిస్థితి ఇలా ఉంటే పొన్నాల లక్ష్మయ్య రాజీనామా పరిణామంపై కాంగ్రెస్ ఎంపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

ఢిల్లీలో( Delhi ) శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.

అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.

ఇన్నేళ్లు పదవులు అనుభవించి, ఈ వయసులో పార్టీ మారటానికి సిగ్గుండాలి.చచ్చేముందు ఆయనకు ఏ రోగం వచ్చింది.? పీసీసీ చీఫ్ గా 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పి వెంటనే పొన్నాల తన రాజీనామా ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు.అంతేకాకుండా త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఈసారి ఎక్కువ సీట్లు కేటాయించినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 50% స్థానాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube