అమెరికాలో( America ) నివసిస్తున్న ఒక లేడీ ఎన్నారైకి దొంగలు షాకిచ్చారు.చండీగఢ్ సిటీలోని( Chandigarh City ) సెక్టార్ 40లో ఎన్నారై డాక్టర్ అమర్జీత్ కౌర్ సాహ్నీకి( Dr Amarjeet Kaur Sawhney ) ఒక పెద్ద ఇల్లు ఉంది.
ఇటీవల ఒక రోజు రాత్రి కొందరు దొంగలు ఆ మహిళ ఇంట్లోకి చొరబడ్డారు.అమెరికాలో ఉంటున్న ఆమె ఆ సమయంలో ఇంట్లో లేరు.
దాంతో వారి పని మరింత సులభం అయింది.వారు ఎంతమంది వచ్చారనేది తెలియ రాలేదు కానీ సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల క్యాష్, కొన్ని విలువైన వాచీలు, నాలుగు మెత్తని శాలువాలను ఎత్తుకెళ్లారు.ఇంటిని చూసుకునే అమర్జీత్ బంధువు సుగ్రీవ్ యాదవ్ మరుసటి రోజు ఇంటిని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు చోరీ గురించి తెలుసుకున్నాడు.
ఇంటి పైకప్పు పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు( Thieves ) రెండు గదుల తాళాలు పగులగొట్టారు.విలువైన వస్తువులను ఎక్కడ ఉంచారో తమకు తెలుసని చూపిస్తూ విలువైన వస్తువులున్న ఒక ట్రంక్ను మాత్రమే తీసుకున్నారు.చోరీపై విచారణ చేసేందుకు పోలీసులు వచ్చారు.
లేడీ ఎన్నారై,( Lady Nri ) ఆమె కుటుంబం 2022లో ఇంటిని సందర్శించి, తిరిగి యూఎస్ వెళ్లారు.పోలీసులు ఇప్పుడు దొంగలను కనుగొని చోరీకి గురైన వస్తువులను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న లేడీ చాలా బాధపడుతున్నారు.తమ సేవింగ్స్ అన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దొంగలను త్వరగా పట్టుకొని తమ ఆస్తిని రికవరీ చేయాలని కోరుతున్నారు.అయితే విలువైన ఆభరణాలు డబ్బులు బ్యాంకు లాకర్లలో స్టోర్ చేసుకోవాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంట్లో భారీగా డబ్బులు ఉంచుకోవడం ఏ మాత్రం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు.