తెలంగాణ రాష్ట్ర బాజాప అధ్యక్ష పదవి( Telangana BJP President ) తీసుకోవడానికి కిషన్ రెడ్డి సుముఖంగా లేరన్న వార్తలు గత కొంత కాలం గా వినిపిస్తునప్పటికి ఎట్టకేలకు ఆయన పదవి స్వీకరించడానికి సిద్ధమయ్యారు.తన ఉనికిని చూపించుకోవడానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కోసం ఆయన తలపెట్టిన కార్యక్రమం రసాభాస గా మారి ఆయన అరెస్టు వరకు పరిస్థితులు దారితీసాయి.
కిషన్ రెడ్డి( G Kishan Reddy )ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరిగి బిజెపి కార్యాలయం వద్ద విడిచిపెట్టారు .కేంద్ర మంత్రి నైన తనతో పోలీసులు వ్యవహరించే పద్ధతి ఇది కాదంటూ ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు అయితే ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యలలో బాగం గానే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది.
తాజాగా నాంపల్లి లోని బిజెపి కార్యాలయం( Nampally BJP Office )లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి బాజాపా ప్రముఖులందరూ హాజరయ్యారు.తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి( Vijayashanthi ) కూడా ఈ కార్యక్రమానికి హాజరై కిషన్ రెడ్డిని శాలువా తో సత్కరించారు .అయితే కార్యక్రమం మధ్యలోనే ఆమే బయటకు వచ్చేసారని ఆమె బిజెపి నేతల తీరుపై ఆగ్రహంతోనే బయటకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది .అయితే తన ఆగ్రహానికి కారణాన్ని కూడా ట్విట్టర్ ద్వారా రాములమ్మ తెలియజేశారు.
వీర సమైక్య వాదిగా పేరుపొందిన కాంగ్రెసు మాజీ ముఖ్య మంత్రి కిరణ్ రెడ్డి( Ex Chief Minister Kiran reddy )ని పొగుడుతున్న బిజెపి నేతల తీరు నచ్చకే ఆయన ఉన్నచోట సౌకర్యంగా ఫీల్ అవ్వక నేను బయటకు వచ్చేసాను అంటూ ఆమె ట్వీట్ చేశారు .ఎంఐఎం ఆగడాలను అరికట్టి ఓవైసీ సోదరులను జైలుకు పంపించిన దమ్మున్న లీడర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కె లక్ష్మణ్ పోగొడడం రాములమ్మకు నచ్చలేదని తెలుస్తుంది .అయితే పొలిటికల్ వ్యూహాలలో( Political Strategies ) భాగంగా అనేకమంది అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని వాటిని పట్టుకొని వ్యక్తులను ద్వేషించడం మొదలుపెడితే రకరకాల పార్టీలు మారిన రాజకీయ నాయకులు మధ్య విజయశాంతి ఎలా ఇముడు తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి
.