టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్ పై ఆ పార్టీ నేత బోండా ఉమ స్పందించారు.అరెస్టును ఖండించిన ఆయన అక్రమ మైనింగ్ ను అడ్డుకుంటే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
వైసీపీ ధన దాహానికి అంతు లేకుండా పోయిందని బోండా ఉమ ఆరోపించారు.ప్రతి రోజూ తాడేపల్లికి డబ్బుల లారీలు రావాల్సిందేనన్నారు.
జిల్లాల వారీగా మట్టిని, కంకరను వైసీపీ నేతలు కొట్టేస్తున్నారని ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో నిమ్మలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.