ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం చినకాపవరంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు నిరసన సెగ.తమకు పట్టాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలు చూపించలేదని మంత్రిని నిలదీసిన కొంతమంది లబ్ధిదారులు.
కొంతమందికి ఇళ్ల పట్టాలు అందలేదని కొంతమందికి ఇళ్ల పట్టాలు అందిన లేఅవుట్ పూర్తిగా ఫ్లాట్లు అధికారులు విడగొట్టలేదని పిర్యాదు.
నాలుగు సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు ఉన్నా ఎక్కడ ఇంటి నిర్మాణం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని పెర్కొన్న లబ్ధిదారులు.
అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.
.