ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈడీ అసత్య ఆరోపణలు చేస్తోందని సిసోడియా పిటిషన్ లో పేర్కొన్నారు.ఎటువంటి నగదు తన వద్ద దొరకలేదన్న ఆయన కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు.
ఈక్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.మరోవైపు మద్యం కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని ఈడీ వాదిస్తోంది.
సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపిస్తుంది.ఇప్పటికే సీబీఐ కేసులో సిసోడియాకి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.