ప్రస్తుతం సినీ వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో ఎంతోమంది హీరోలు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఆగ్ర హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా మరికొందరు పాన్ ఇండియా హీరోలుగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారిలో రామ్ చరణ్ ఒకరు.
అలాగే మంచు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మంచు విష్ణు కూడా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడానికి కృషి చేస్తున్నారు.ఇలా ఈ ఇద్దరు హీరోలు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.
![Telugu Acharya, Chiru, Godfather, Konidela, Manchu Vishnu, Mohan Babu, Ram Chara Telugu Acharya, Chiru, Godfather, Konidela, Manchu Vishnu, Mohan Babu, Ram Chara](https://telugustop.com/wp-content/uploads/2023/02/only-manchu-vishnu-ram-charan-owns-this-record.jpg )
ఇలా ఈ జనరేషన్లో ఈ యంగ్ హీరోలు ఇద్దరు కూడా ఒక అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారని చెప్పాలి.అయితే ఈ ఇద్దరు హీరోలు సాధించిన ఆ ఘనత ఏంటి అనే విషయాన్ని వస్తే రామ్ చరణ్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం మనకు తెలిసిందే.రామ్ చరణ్ తన ఇంటి పేరుతో కొనిదెల ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి తన నిర్మాణ సంస్థలో తన తండ్రి హీరోగా ఖైదీ నెంబర్ 150 సినిమాని నిర్మించారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా అనంతరం గాడ్ ఫాదర్ ఆచార్య సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలకు కూడా నిర్మించారు.
![Telugu Acharya, Chiru, Godfather, Konidela, Manchu Vishnu, Mohan Babu, Ram Chara Telugu Acharya, Chiru, Godfather, Konidela, Manchu Vishnu, Mohan Babu, Ram Chara](https://telugustop.com/wp-content/uploads/2023/02/only-manchu-vishnu-ram-charan-owns-this-recordc.jpg )
ఈ విధంగా రాంచరణ్ సొంత నిర్మాణంలో తన తండ్రితో సినిమాలు చేసిన విధంగానే మంచు విష్ణు కూడా తన సొంత నిర్మాణంలో తన తండ్రితో సినిమాలు చేశారు.ఇలా ఇద్దరు ఈ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారని చెప్పాలి.మంచు విష్ణు తన సొంత నిర్మాణంలో మోహన్ బాబు హీరోగా సన్నాఫ్ ఇండియా అనే చిత్రాన్ని చేశారు.
అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ కొడుకు నిర్మాణ సంస్థలో నటించిన తండ్రులుగా మోహన్ బాబు చిరంజీవి నిలిచారు.ఇక ప్రస్తుతం విష్ణు మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోగా, రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనులతో బిజీగా ఉన్నారు.