ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై అచ్చె నాయుడు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చె నాయుడు.ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 Atchannaidu Serious Comments On Buggana Rajanedranath Reddy Tdp, Atchannaidu, Bu-TeluguStop.com

నిన్న బెంగళూరులో జరిగిన ఓ రోడ్ షోలో ఏపీకి విశాఖ ఒకటే రాజధాని అని బుగ్గన కామెంట్లు చేయడం జరిగింది.దీంతో బుగ్గన చేసిన వ్యాఖ్యలను అచ్చె నాయుడు తీవ్ర స్థాయిలో ఖండించారు.రాజధాని విషయంలో ఎన్నిసార్లు మాటలు మారుస్తారు అని మండిపడ్డారు.“అసలు ఏపీ ప్రజలు ఎలా కనిపిస్తున్నారు మీకు? ఎన్ని సార్లు ఎన్ని మాటలు మార్చుతారు? నాలుగేళ్ళు అయ్యాక మిస్-కమ్యూనికేషన్ అంటారా? అంటే రాష్ట్ర రాజధాని ఏదో కూడా ప్రపంచానికి కమ్యూనికేట్ చెయ్యలేని దద్దమ్మ ముఖ్యమంత్రి, దద్దమ్మ మంత్రులు ఉన్నారు అన్నమాట”.అని సోషల్ మీడియాలో మండిపడ్డారు.

ఫిబ్రవరి 14వ తారీకు బెంగుళూరు లో జరిగిన రోడ్ షోలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరియు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.విశాఖపట్నంలో మార్చి 3, 4 తారీఖులలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా.ఏపీ మంత్రులు పరు నగరాలలో రోడ్ షోలు చేపడుతున్నారు.

దీనిలో భాగంగా బెంగళూరులో జరిగిన రోడ్డు షోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ ఏకైక రాజధాని అని బుగ్గన తెలిపారు.మూడు రాజధానులు అంటూ ప్రజలలో మిస్ కమ్యూనికేట్ అయిందని కామెంట్ చేశారు.

దీంతో ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చె నాయుడు.సోషల్ మీడియాలో ఖండించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube