మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురిపై పులి దాడికి పాల్పడింది.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పెద్దపులుల సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తడోబా పులి సంరక్షణ కేంద్రంలో పర్యాటకులకు అనుమతిని నిరాకరిస్తున్నారు.
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం చంద్రాపూర్ అటవీ ప్రాంతంలోనే 50 మంది మృతిచెందారు.పులుల వరుస దాడులతో అటవీ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు.
తడోబాతో పాటు అంధేరి ప్రాంతంలో పులుల సంచారం పెరిగిందన్న అధికారులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.