బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అందరికీ సుపరిచితుడే.వైవిద్య భరితమైన ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ… ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటాడు.
ఎటువంటి క్యారెక్టర్ లోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి.రక్తి కట్టిస్తాడు.
ఈ ఏడాది ప్రారంభంలో “లాల్ సింగ్ చడ్డా” అనే సినిమాతో అమీర్ ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే.భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది.
ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే నెగిటివ్ ప్రచారం గట్టిగా జరిగింది.ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు.
కరీనాకపూర్ హీరోయిన్ గా నటించడం జరిగింది.
హిందీతో పాటు అనేక భాషలలో విడుదలైన ఈ మూవీ తెలుగులో స్వయంగా చిరంజీవి విడుదల చేయడం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే ఇటీవల అమీర్ చిన్ననాటి స్నేహితులంతా కలిసి ఓ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అమీర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ దాదాపు 35 సంవత్సరాలు పాటు సినిమాయే లోకం అన్నట్టు బతికాను.నిరంతరం పని గురించి ఆలోచించాను.
నాకు దగ్గరైన మనుషుల గురించి కూడా ఆలోచించలేకపోయాను.కానీ రానున్న ఏడాదిన్నర దాకా సినిమాలకి బ్రేక్ చెప్పేయటం జరిగింది.
కెమెరా ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు.నాకు దగ్గరగా ఉండే వారితో ఏడాదిన్నర పాటు కలసి వారితో సమయం గడుపుతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి “లాల్ సింగ్ చడ్డా” తర్వాత “చాంపియన్స్” అనే సినిమా చేయాలి.కానీ ప్రస్తుతం నాకు విశ్రాంతి కావాలి.
అందుకే ఆ సినిమా పక్కన పెట్టేసాను.ప్రస్తుతానికి అయితే నా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంటూ అమీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.