సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘జనగణమన‘.పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా విజయ్ తో చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ పూరీ ప్లాన్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
లైగర్ సినిమా రిలీజ్ అవ్వకుండానే విజయ్ పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచాడు పూరీ.
తాజాగా ఈ రోజు ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
మరి ఎట్టకేలకు ఈ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ అవవడంతోనే అన్ని భాషల్లో సంచలనాలు క్రియేట్ చేస్తుంది.ఈ రోజు హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లో మేకర్స్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.
ఇందులో భాగంగా విజయ్ లైగర్ సినిమాపై మాట్లాడారు.ఈ సినిమాను తన అభిమానులకు అంకితం చేస్తున్నట్టు చెప్పి వారిలో మరింత జోష్ నింపాడు. లైగర్ ను ఫ్యాన్స్ కు అంకితం చేసాడు అని తెలిసిన ఫ్యాన్స్ ఈయన పై మరింత అభిమానం పెంచుకుంటున్నారు.ఇక ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.