భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్, రానాలను బాగా హ్యాండిల్ చేసి సినిమాతో హిట్ అందుకున్నాడు డైరక్టర్ సాగర్ చంద్ర.భీమ్లా నాయక్ హిట్ క్రెడిట్ అంతా కూడా త్రివిక్రం ఖాతాలో వేసుకున్నా సరే డైరక్టర్ గా సాగర్ చంద్రకి మంచి క్రేజ్ ఏర్పడింది.
అంతేకాదు అతని కెరియర్ లో అంతకుముందు తీసిన సినిమాల వల్ల కూడా ఆ ఇంప్యాక్ట్ వచ్చింది.ఇదిలాఉంటే భీమ్లా నాయక్ తర్వాత సాగర్ చంద్ర ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇద్దరు ముగ్గురు హీరోలతో అనుకున్నా సరే ఫైనల్ గా యువ హీరో నితిన్ తో సాగర్ చంద్ర సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
సాగర్ చంద్ర చెప్పిన కథకు నితిన్ ఇంప్రెస్ అయినట్టు టాక్.
ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ డైరక్షన్ లో సినిమా ఉంది.
ఈ సినిమాల తర్వాత సాగర్ చంద్ర డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది.నితిన్ తో సాగర్ చంద్ర కాంబో మాత్రం క్రేజీగా ఉందని చెప్పొచ్చు.
లవర్ బోయ్ సినిమాలను పక్కన పెట్టి ఇక మీదట నితిన్ కూడా యాక్షన్ సినిమా చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.అందుకే వరుస మాస్ కథలకే ఓటేస్తున్నాడట నితిన్.