యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నవీన్ పోలిశెట్టి కెరీర్ ను మొదలుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా నవీన్ పోలిశెట్టి ప్రయాణం మొదలుకాగా ఈ సినిమాకు ప్రశంసలతో పాటు భారీస్థాయిలో కలెక్షన్లు కూడా వచ్చాయి.
ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు హీరోగా నవీన్ పోలిశెట్టి స్థాయిని పెంచింది.
జాతిరత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి కామెడీ డైలాగ్స్ ను చెప్పిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
నవీన్ పోలిశెట్టి, అనుష్క కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.జాతిరత్నాలు సినిమా విడుదలై ఏడాది అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా విడుదలై సంవత్సరం అయిన సందర్భంగా నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
గతేడాది నిర్మాతలకు భారీ లాభాలను అందించిన సినిమాలలో జాతిరత్నాలు ఒకటనే సంగతి తెలిసిందే.
జాతిరత్నాలు సినిమా రిలీజై సంవత్సరం అయిందని ఈ సినిమా రిలీజ్ సమయానికి థియేటర్లు పూర్తిగా తెరుచుకోలేదని ప్రజలకు వ్యాక్సినేషన్ కూడా జరగలేదని నవీన్ పోలిశెట్టి అన్నారు.జాతిరత్నాలు రిలీజ్ సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా సినిమాను ఆదరించినందుకు నవీన్ పోలిశెట్టి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
సినిమాల్లోకి వస్తానని చెప్పిన సమయంలో నాన్న బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎలారా అని అన్నారని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం తాను ఒంటరి కాదని అనిపిస్తోందని నవీన్ పోలిశెట్టి వెల్లడించారు.ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తానని నవీన్ పోలిశెట్టి పేర్కొన్నారు.తనకు తెలుగు ప్రేక్షకులు తోడుగా ఉన్నారని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చారు.