పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.
కరోనా ఫస్ట్ వేవ్ నుండి ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది.
ఈసారి కూడా వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేసారు.తమ అభిమాన హీరోను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.అందుకే రాధేశ్యామ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది.
తాజాగా సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు.ఫస్ట్ ట్రైలర్ లో విక్రమాదిత్య, ప్రేరణ జంట మధ్య లవ్ చూపించిన మేకర్స్.
ఇప్పుడు విక్రమాదిత్య పామిస్ట్ గా తన కెరీర్ లో చెప్పినా విషయాలు ఎంత కరెక్ట్ గా జరిగాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు.ఈయన సక్సెస్ ను చూపించిన విధానం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.
1 నిముషం 3 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్.మనం ఆలోచిస్తున్నాం అని భ్రమ పడతాము.మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి.అంటూ ప్రభాస్ వాయిస్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది.హస్త సాముద్రికం ఏ రేంజ్ లో నిజం అవుతుందో చూపించారు.చివరిగా ప్రేరణ ‘అన్ని కరెక్ట్ గా చెప్పే విక్రమాదిత్య.
తన ప్రేమ విషయంలో తప్పుగా ఆలోచించాడు’ అని చెప్పే డైలాగ్ ఆసక్తి రేకేత్తించింది.మరి ఈ సినిమాతో ప్రభాస్, పూజా హెగ్డే జంట ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాలి.