సర్కారు వారి పాట.. అలాంటి రిస్కులు వద్దన్న మహేష్ బాబు?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 Mahesh Babu Wants To Change Small Corrections In Sarkaru Vaari Paata Climax, Tol-TeluguStop.com

ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుపుకుంటోంది.

షూటింగ్ లో భాగంగా మహేష్ బాబు కాలికి గాయమవడంతో షూటింగ్ ఆగిపోయింది.మహేష్ బాబు కీ స్పెయిన్ లో మోకాలికి ఆపరేషన్ జరిగింది.

షూటింగ్ లో కి తగిలిన గాయం పెద్ద వడంతో అది కాస్తా సర్జరీ వరకు వెళ్ళింది.ప్రస్తుతం మహేష్ బాబు దుబాయ్ లో ఉన్నారు.

ఇంకా కొన్ని రోజుల పాటు అక్కడే ఉండబోతున్నాడు.

మహేష్ దాదాపుగా రెండు నెలలపాటు దుబాయ్ లోనే ఉండాలి అనుకుంటున్నాడట.

పనిలో పనిగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా దుబాయ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు.మహేష్ బాబుతో పాటు అతడి ఫ్యామిలీ కూడా ప్రస్తుతం దుబాయ్ లోనే ఉంది.

ఇక మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా దాదాపు 70 శాతం వరకు పూర్తి అయ్యింది.కేవలం క్లైమాక్స్ చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉంది.

సర్కారు వారి పాట సినిమా క్లైమాక్స్ విషయంలో మహేష్ సంతృప్తిగా లేకపోవడంతో దర్శకుడు అలాగే చిత్రబృందం మరొకసారి క్లైమాక్స్ విషయంలో కుస్తీ పడుతున్నట్లు సమాచారం.అలాగే మహేష్ బాబు ఇండియాకు రావడానికి రెండు  నెలలు సమయం పడుతుండటంతో ఆలోపు ఫర్పెక్ట్ ఫ్లాన్ చేస్తున్నారు దర్శకుడు పరశురామ్.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Parushu Ram, Tollywood-Movie

ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.ఈ సినిమా దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఇది ఇలా ఉంటే అన్ని విషయాల్లో బాగానే ఉన్న మహేష్ బాబు ఒక విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.చాలా మంది హీరోలు తమ సినిమాలను తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

కానీ మహేష్ బాబు మాత్రం తన సినిమాను ఇతర భాషలలో రిలీజ్ చేయడానికి ఇష్ట పడటం లేదు.సర్కారు వారి పాట సినిమాను కేవలం తెలుగు వరకు మాత్రమే నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలోని కథ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే చేరువయ్యేలా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమాను అన్ని భాషల్లో విడుదల చేసి.సినిమా విడుదల తర్వాత ఫలితాలు చూసి బాధపడటం కంటే ముందుగానే అన్ని ప్లాన్స్ తో వెళ్తున్నారు మహేష్ బాబు అండ్ చిత్ర బృందం .మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్ 1, 2022 న విడుదల కానుంది.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube