టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారు.
ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు.
ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకునేలా ఉండలని రెగ్యులర్ గా ఏదొక అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక ఈ మధ్యనే ఈ సినిమా నుండి గ్రాండ్ విజువల్స్ తో ఫుల్ ప్యాక్డ్ గా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ గ్లిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక రేపు ఈ సినిమా నుండి మరొక పాటను కూడా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి కూడా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటూ ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాడు.
ఈ నేపథ్యంలో రాజమౌళి తాజాగా ఈ సినిమా నుండి ఒక ప్రత్యేక డైలాగ్ ను లీక్ చేసాడు.ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా జక్కన్న తన సినిమా నుండి ఒక ప్రత్యేకమైన స్పెషల్ డైలాగ్ ను లీక్ చేసాడు.ప్రెసెంట్ ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
”యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయి.అది ధర్మ యుద్ధం అయితే విజయం తథ్యం” అంటూ సాగే ఈ ఫుల్ డైలాగ్ ను లీక్ చేసాడు జక్కన్న.ఇది ఈ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్స్ లో ఒకటి అన్నట్టు తెలుస్తుంది.
మరి ముందు ముందు మరిన్ని అద్భుతమైన అప్డేట్ లు చూపిస్తాడో చూడాలి.ఇక ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని కోట్లు రాబడుతుందో అని అందరు వేచి చూస్తున్నారు.