తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వచ్చీరావడంతోనే సినిమా అవకాశాలతో బిజీ బిజీ అయి పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం ఉన్నఫలంగా యాక్టింగ్ కి గుడ్ బై చెప్పి సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోయిన నటీనటులు చాలా మందే ఉన్నారు.అయితే ఇందులో తెలుగులో భద్రాచలం, వైశాలి, రెయిన్బో, శ్రీరామ చంద్రులు, చందమామ తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకున్న టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ “సింధూ మీనన్” కూడా ఈ కోవకే చెందుతుంది.
కాగా నటి సింధు మీనన్ తెలుగులో “భద్రాచలం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైంది.కానీ మొదటగా కన్నడ భాషలో “రష్మీ” అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.
ఆ తర్వాత తమిళం, మలయాళం, తెలుగు తదితర భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ కొన్ని సంవత్సరాలపాటు సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడిపింది.
కానీ అనుకోకుండా ఒకానొక సమయంలో సింధు మీనన్ హీరోయిన్ గా నటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించింది.
ఈ క్రమంలో బ్రిటన్ దేశంలో సాఫ్టు వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న “డొమినిక్ ప్రభు” అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లయిన తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటించినప్పటికీ అవి కూడా పెద్దగా సినీ కెరీర్ ని మలుపు తిప్పలేక పోయాయి.
దీంతో సింధుమీనన్ నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి ప్రస్తుతం బ్రిటన్ దేశంలో సెటిల్ అయినట్లు సమాచారం.అయితే సినీ పరిశ్రమ నుంచి వైదొలగిన సింధు మీనన్ సోషల్ మీడియా మాధ్యమాలలో అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది.కాగా తాజాగా సింధు మీనన్ తన భర్త మరియు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది.దీంతో ఈ ఫోటోలో సిందు మీనన్ ని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నటి సింధు మీనన్ బాగానే బరువు పెరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే పెళ్లి చేసుకున్న తర్వాత సినీ కెరియర్ కి స్వస్తి పలికి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన నటీనటులు కూడా సినిమా పరిశ్రమలో చాలామంది ఉన్నారు.
కానీ నటి సింధు మీనన్ మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం కేటాయించింది.అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నటి సింధు మీనన్ తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు అవకాశాలు తలుపు తట్టినప్పటికీ నటనపై ఆసక్తి లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.