కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో తక్కువగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా అనే మూవీలో నటిస్తుండగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
నేడు మహానేత వైఎస్సార్ జయంతి కాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
సోషల్ మీడియా ఖాతాల ద్వారా సినీ, రాజకీయ ప్రముఖులు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్నారు.మోహన్ బాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.
నేడు మా బావ గారు వైఎస్సార్ పుట్టినరోజు అని ఆయన పేదల పాలిట దైవమని మోహన్ బాబు వెల్లడించారు.వైఎస్సార్ రాజకీయ దురంధరుడని, స్నేహశీలి అని మోహన్ బాబు పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మా కుటుంబానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనలు ఉండాలని తాను కోరుకుంటున్నానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.టాలీవుడ్ సినీ ప్రముఖులు బండ్ల గణేష్, గోపీచంద్ మలినేని, కోన వెంకట్ వైఎస్సార్ కు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ చెదరని చిరునవ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచిన ఆయుధమని పోరాడే గుణం వైఎస్సార్ ఇచ్చిన బలం అని మాట తప్పని నైజం తండ్రి నేర్పిన పాఠమని తండ్రి ఆశయాలే తనకు వారసత్వమని జగన్ పేర్కొన్నారు.జగన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు.