తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన “వీర భద్ర” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “తను శ్రీ దత్త” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలోతను శ్రీ తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అవుతోంది.
కాగా ఆ మధ్య బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ తనని లైంగికంగా వేధించాడని అంతేకాకుండా ఓ చిత్రంలో నటిస్తున్నప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గతంలో పలు ఆరోపణలు చేసింది.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి నానా హంగామా చేసింది.
ఈ మధ్య ఈ వివాదం సర్ధు మనగడంతో సినిమాలపై దృష్టి సారించింది.దీంతో అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ అందమైన ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.
కాగా తాజాగా స్కిన్ షో మరియు క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అంతే కాకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసి కుర్రకారు గుండెల్లో అమాంతం పెంచేసింది.
అయితే ఈ అమ్మడు ఫోటోలను షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.అంతేకాకుండా తను శ్రీ అందాల ఆరబోతకు ఫిదా అయిన నెటిజన్లు ఏకంగా “40 ఏళ్ళ వయస్సులో కూడా తను శ్రీ అందాల ఆరబోతతో మత్తెక్కిస్తోందని” కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి తను శ్రీ అనుకోకుండా పలు వివాదాల్లో చిక్కుకోవడంతో కెరియర్ పరంగా పెద్దగా రాణించలేక పోయింది.దీంతో 2010 వ సంవత్సరంలో విడుదలైన అపార్ట్ మెంట్ అనే చిత్రంలో చివరగా కనిపించింది.
ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకూ ఎలాంటి సినిమాల్లో నటించలేదు.అయితే అప్పట్లో నటి తను శ్రీ మిస్ ఇండియా అవార్డును కూడా సొంతం చేసుకుంది.
అంతేకాకుండా మిస్ యూనివర్స్ పోటీలలో కూడా పాల్గొని టాప్ 10 కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచింది.కాగా ఇటీవలే ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.