బాలీవుడ్ హీరో సుశాంత్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఎంక్వౌరీ చేయడం జరిగింది.
ముఖ్యంగా రియా మరణంకు కారణం అంటూ కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్న రియాను సీబీఐ వారు వరుసగా అయిదు రోజుల పాటు విచారించారు. ప్రతి రోజు ఉదయం నుండి రాత్రి వరకు వారు విచారణ కొనసాగించారు.
ఆమె నుండి పలు విషయాలను రాబట్టిన సీబీఐ వారు తాజాగా ఒక ఆసక్తికర ప్రకటన చేశారు.
సుశాంత్ ను హత్య చేసినట్లుగా మాకు ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు లభ్యం కాలేదు.
ఆయన మృతికి ప్రత్యక్షంగా ఎవరు కూడా కారణం కాకపోవచ్చు అంటే ఆయనది ఆత్మహత్య అయ్యి ఉంటుందని సీబీఐ వారు దాదాపుగా ఒక నిర్థారణకు వచ్చారు.అయితే ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
సుశాంత్ మృతికి సంబంధించిన మీడియా కథనాలు చూస్తుంటే కూడా రియా విషయంలో అనుమానాలకు సమాధానాలు లభిస్తున్నాయి.
చాలా ఏళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్న సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా తన నుండి దూరం అవ్వడంతో పాటు ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేయడంతో అతడు మరింతగా క్షోభించాడు.
దాంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అంటున్నారు. రియా వల్ల ఆత్మహత్య చేసుకున్నాడేమో కాని ఆమెది ఇందులో ఏమాత్రం భాగస్వామ్యం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రియా సుశాంత్ ను వాడుకుని వదిలేసింది.అతడు డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడని మరి కొందరు అంటున్నారు.