మారుతున్న కాలంతో పాటే మనిషి జీవితకాలం తగ్గుతోంది.ఒకప్పుడు మనిషి సగటు జీవితకాలం 80కు పైగా ఉండగా ప్రస్తుతం మనిషి జీవితకాలం 60కు అటూఇటుగా ఉంది.కాలుష్యం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ఇతర కారణాలు మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నాయి.30 ఏళ్లకే గుండె జబ్బులు, బీపీ, షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.
మనిషి ఆయుష్షు క్రమంగా తగ్గుతున్న తరుణంలో ఈక్వెడార్ లో ఒక జంట మాత్రం ప్రపంచంలోనే వృద్ధ జంటగా రికార్డులకెక్కింది.వీరిద్దరి వయస్సు ఏకంగా 214 సంవత్సరాల 358 రోజులు కావడం గమనార్హం.
జూలియో సీజర్ మోరా, వాల్డ్రామినా క్వింటెరోస్ క్విన్టెరో అనే భార్యాభర్తలు వృద్ధ జంటగా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకుని ప్రపంచం మొత్తం తమ గురించి మాట్లాడుకునేలా చేసుకున్నారు.
మోరా 1910 మార్చి 10వ తేదీన జన్మించగా క్విన్టెరో 1915 అక్టోబర్ 15వ తేదీన జన్మించింది.
వీరిద్దరూ 1941 ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు.గిన్నీస్ వరల్ద్ రికార్డ్స్ తో ఈ జంట మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనానికి ప్రేమ, గౌరవం, నిజాయితీతో కూడిన వృత్తి, సరైన విద్య అవసరం అని పేర్కొన్నారు.
మోరా క్విన్టెరో జంటకు ఐదుగురు సంతానం.ఆ కాలంలోనే ప్రేమ వివాహం చేసుకుని రికార్డులకెక్కిన వృద్ధ జంట నెటిజన్లను ఆకర్షిస్తోంది.