ప్రస్తుతం అంతా లాక్డౌన్లో ఉన్న విషయం తెలిసిందే.కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు సోషల్ డిస్టెంసింగ్ను పాటించాలని, అందుకే ఈ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఈ లాక్డౌన్కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమ పూర్తి మద్దతు తెలిపిన సంగతి కూడా తెలిసిందే.
ఇక సినీ రంగానికి చెందిన వారు అందరూ కూడా ఈ సమయంలో ఇళ్లకే పరిమితమై, ఇంట్లో పనులు చేసుకుంటున్నారు.
అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.తాజాగా ఆయన మాస్క్ వేసుకుని నిత్యావసరాలు కొనేందుకు ఓ సూపర్ మార్కెట్కు వెళ్లాడు.అయితే మాస్క్ ఉండటంతో ఆయన్ను ఎవరూ గుర్తుపట్ట లేకపోయారు.దీంతో బన్నీ చేసిన పనికి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా సెలబ్రిటీ అయి ఉండి కూడా ఇలా లాక్డౌన్ సమయంలో బయటకు రావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.అయితే ఆయన పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు అందరికీ దూరంగా ఉంటూ, మాస్క్ ధరించి షాపింగ్ చేయడంలో తప్పేముందని అభిమానులు అంటున్నారు.