తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాపై అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత అనిల్ సుంకర తాజాగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
మహేష్ నటించిన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానంటూ అనిల్ సుంకర చెప్పుకొచ్చాడు.
అంతేగాక ఈ సినిమా కథ ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో రాని కథగా ఆయన తెలిపారు.ఆర్మీ మేజర్గా కనిపించే మహేష్ బాబు, రాయలసీమకు వస్తారు.ఆ తరువాత జరిగే కథను తాను ఇప్పటివరకు ఎలాంటి సినిమాలో చూడలేదని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు.
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని, మహేష్ బాబు ఫ్యాన్స్కు ఈ సినిమా నిజమైన పండగ అంటూ అనిల్ సుంకర చెప్పారు.
ఇక జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.