ప్రస్తుతం నయనతార మూడు పదుల వయసు దాటినా చేతిలో అవకాశాలు మాత్రం తగ్గకుండా ఏడాదిలోని అన్ని రోజులూ బిజీబిజీ గా గడుపుతోంది.ఈ అమ్మడు ప్రస్తుతం తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న దర్భార్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా నయనతార దర్భార్ చిత్ర దర్శకుడు ఏ.ఆర్ మురగదాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా గతంలో తాను నటించినటువంటి గజిని చిత్రంలో నటించడమే తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయమని అన్నారు.
అలాగే దర్శకుడు మురుగదాస్ తనను ఈ చిత్రంలో చూపించే తీరు కూడా తనకు అస్సలు నచ్చలేదని అన్నారు.అయితే ఇందుకుగానూ ఎవరినీ తప్పుపట్టడం లేదని ఇది కేవలం తన జీవితంలో ఎదురైన ఒక అనుభవం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురగదాస్ స్పందించారు.తాను చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ బి చూడడని కేవలం పాత్ర డిమాండ్ మేరకు మాత్రమే ఎవరికీ ఏ పాత్ర ఇవ్వాలని ఆలోచిస్తానని అన్నారు.అందువలనే గజిని ఆమె పాత్రకి తగ్గట్లుగా ఆమెను చూపించామని మురగదాస్ క్లారిటీ ఇచ్చాడు.