టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 152 వ సినిమాగా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నారు.
ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్నాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ధర్మస్థలి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొరటాల శివ కమర్షియల్ అంశాలను జోడించి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా షూట్ కరోనా కారణంగా ఆలస్యం అవ్వడం వల్ల విడుదల కూడా ఆలస్యం అయ్యింది.లేదంటే మే లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్ ప్రకటిస్తుండడంతో ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ పై ఒక బజ్ హాట్ టాపిక్ అయ్యింది.ఈ సినిమాను ఈ మూడు సీజన్స్ లో ఏదో ఒక సీజన్ లో ఖచ్చితంగా విడుదల చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి.ముందుగా ఈ సినిమా వస్తే క్రిస్మస్ కే వస్తుందట అది మిస్ అయితే ఆ తర్వాత సంక్రాంతి సీజన్ లో అది కూడా మిస్ అయితే మహా శివరాత్రికి ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరి చూడాలి చివరకు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో.