సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార ( Nayanatara ).గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి నయనతార గురించి తాజాగా నటుడు విశాల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశాల్ ( Vishal ) తాజాగా నటిస్తున్నటువంటి చిత్రం మార్క్ ఆంటోనీ ఇందులో ప్రీతి వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుంది.
ఇలా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశాల్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు ఈయనని ప్రశ్నిస్తూ నటి నయనతార సినిమా ప్రమోషన్ ( Movie Promotions ) కార్యక్రమాలకు హాజరు కాకపోవడం గురించి ఈయనని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు విశాల్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
నయనతార ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలోనూ పాల్గొనరు.అది ఆమె వ్యక్తిగత హక్కు అని విశాల్ తెలిపారు.అయితే కచ్చితంగా పాల్గొనాలని ఆమెను మనం డిమాండ్ చేయలేము.కానీ ఆమె కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరైతే బాగుంటుందని ఈ సందర్భంగా నయనతార గురించి విశాల్ చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక నయనతార పెళ్లి తర్వాత నటించిన చిత్రం జవాన్( Jawan ) ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఈ సినిమా విడుదల కాబోతుంది మరి ఈ సినిమా ప్రమోషన్లలో ఆయన నయనతార పాల్గొంటారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.