చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం చిత్రీకరణ పూర్తి అయ్యింది.భారీ ఎత్తున అంచనాల నడుమ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంను రామ్ చరణ్ భారీ బడ్జెట్తో నిర్మించిన విషయం తెల్సిందే.
ఈ చిత్రంను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఇక ఈ చిత్రం విడుదలకు నెలన్నర రోజులు ఉండగానే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను రామ్ చరణ్ చూసుకునే పరిస్థితి లేదు.ఎందుకంటే ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు.ఆయన సైరా చిత్రం ప్రమోషన్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఆ ప్రమోషన్ బాధ్యతలను చరణ్ భార్య ఉపాసన నెత్తికి ఎత్తుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ చిత్రంను తెలుగుతో పాటు తమిళం మరియు హిందీ భాషల్లో భారీగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
అక్కడ భారీ విడుదల కోసం ప్రమోషన్స్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు.రికార్డు స్థాయి బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రంకు ప్రమోషన్స్తో హైప్ తీసుకు వస్తేనే సినిమాను భారీ మార్కెట్ చేసే అవకాశం ఉంటుంది.అందుకే ఉపాసన ఈ చిత్రం ప్రమోషన్ కోసం కొత్త విధానాన్ని ఎంచుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
తన బిజినెస్ మైండ్తో ఈ చిత్రంను ప్రమోట్ చేయబోతుందట.మరి సైరా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక ఉపాసన ప్రమోషన్స్ సినిమాకు ఎంత మేరకు ఉపయోగమో అనే విషయం ఆసక్తికరంగా మారింది.