అధికార పార్టీ నేత హత్యకు గురై చెరువులో శమమై తేలాడు.గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ను ఆశించి కంగుతిన్నాడు.
అయితే, అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు విచారణ లో తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
రంగారెడ్డి జిల్లా తాండూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత నాగరాజ్ గౌడ్ హత్యకు గురయ్యాడు.శుక్రవారం నాడు స్థానిక గొల్ల చెరువులో శవమై కనిపించడంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కొడంగల్ నియోజకవర్గంలోని అంగడి రాయిచూర్ గ్రామానికి చెందిన నాగరాజ్ గౌడ్ 20 ఏళ్ల కిందట తాండూర్ మండలం చెంగోల్ గ్రామంలో స్థిరపడ్డాడు.టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ అందకపోవడంతో నిరాశకు గురయ్యాడు.
ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నాగరాజ్ గౌడ్ కు ఆరేళ్ల కిందట మరో మహిళతో వివాహం జరిగింది.
ఆమెను వివాహం చేసుకుని షాద్ నగర్ లో కాపురం పెట్టాడు.వీరిద్దరికి ఒక కూతురు కూడా పుట్టింది.
అయితే నాగరాజ్ రెండో భార్యతోనే ఉండటంతో మొదటి భార్యకు విషయం తెలిసి గొడవలు స్టార్ట్ అయ్యాయి.అయితే ఈ నెల 12వ తేదీన నాగరాజ్ మొదటి భార్య దగ్గరికి వెళ్లడంతో అదే రోజు భార్య, పిల్లలతో గొడవైంది.
అదే రోజు తన తండ్రి కనిపించడం లేదని కూతురు ప్రియా కరన్ కోట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గొల్ల చెరువులో నాగరాజ్ శవాన్ని గుర్తించారు.
దీంతో పోలీసులు మొదటి భార్యను విచారణ చేపట్టగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.పోలీసులు మొదటి భార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.