తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన “బ్రూస్ లీ” అనే చిత్రంలో హీరో రామ్ చరణ్ అక్క పాత్రలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్న “బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బంద” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో కళ్యాణ్ రామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రామ్ పోతినేని తదితర స్టార్ హీరోల చిత్రాలలో నటించినప్పటికీ ఎందుకో తెలుగులో ఎక్కువ కాలం సినిమా హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.
కాగా ఈ మధ్య కాలంలో కృతి కర్బంద తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకి బాగా అందుబాటులో ఉంటోంది.
తాజాగా కృతి కర్బంద తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందిస్తూ తాను ప్రస్తుతం మలేరియా వ్యాధి బారిన పడ్డానని అలాగే తొందరగా కోలుకొని సినిమా షూటింగులకు హాజరు కావాలని ఉందని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది.
దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థుతలలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాగే వైద్యుల సలహాలు తీసుకుంటూ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస హిట్లతో సినిమా అవకాశాల పరంగా దూసుకుపోతోంది.
అంతేగాక బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల చిత్రాలలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 2 వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.