ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం నేషనల్ అవార్డ్ అందుకోవడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇప్పటి వరకు ఈ అవార్డ్ ఏ తెలుగు హీరో కూడా అందుకోలేదు.
ఇలాంటి గొప్ప అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా అల్లు అర్జున్ ఈ అవార్డ్ సొంతం చేసుకోవడంతో మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటు చేసి ఈ అవార్డ్ అందుకున్న వారందరినీ కూడా సత్కరించారు.
ఈ క్రమంలోనే శనివారం మైత్రి మూవీ మేకర్స్ వారు ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ అవుతున్నాయి.
దేవిశ్రీప్రసాద్( Devi Sri Prasad ) తో తనకు చాలా మంచి అనుబంధం ఉందని తెలిపారు తాను చెన్నై వెళ్లిన ప్రతిసారి తనని కలిసే వాడిని తెలియజేశారు.అయితే తనని కలిసిన ప్రతిసారి ముంబై వెళ్లి ప్రయత్నించు మంచి సక్సెస్ అవుతావని తనకు చెప్పేవాడిని కానీ దేవిశ్రీ మాత్రం నీతో పాటే నేను కూడా బాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తాను అంటూ చెప్పేవారు.బాలీవుడ్ వెళ్లడం కష్టమంటూ అప్పట్లో దేవితో చెప్పేవాడిని అయితే 20 సంవత్సరాల తర్వాత మేము అనుకున్న విధంగానే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళామని ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలిపారు.
ఇక పుష్ప సినిమా నేషనల్ అవార్డు ( National Award ) అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే నాకు ఈ అవార్డు రావడానికి కారణం నా చుట్టూ ఉన్న వాళ్లేనని అల్లు అర్జున్ తెలిపారు.వాళ్లంతా నాకు ఈ అవార్డు రావాలని కోరుకున్నారు కాబట్టి నాకు ఈ అవార్డు వచ్చిందని ఈయన తెలియచేశారు.మనం ఒక పని అనుకోవడం కష్టపడటం 50% మాత్రమే, మన పక్కన ఉన్నవాళ్లు గట్టిగా కోరుకున్నప్పుడే అవి నిజమవుతాయని అల్లు అర్జున్ తెలిపారు.
సుకుమార్ గారు స్వార్థం లేని డైరెక్టర్ ఆయన నాతో ఒకటే మాట అన్నారు.సినిమా ఫలితం కలెక్షన్స్ ఇవన్నీ కాదు నీలో ఉన్నటువంటి నటన బయటకు రావాలి అన్నారు.
నేను ఈ విజయం సాధించాను అయితే ఈ విజయం మాత్రం సుకుమార్ గారిది అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.