Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

వైగో కు ఝలక్ ఇచ్చిన చెన్నై కోర్టు

చెన్నై ఎండీ ఎం కే నేత వైగో కు చెన్నై కోర్టు భారీ ఝలక్ ఇచ్చింది.ఆయనపై నమోదైన దేశ ద్రోహం కేసు కు సంబంధించి ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.2009లో వైకో తన పుస్తకం...

Read More..

బావ చెప్తే సరే : అనంత టీడీపీని లీడ్ చేస్తున్న బాలయ్య ?

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్నఅనంతపురం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి.ముఖ్యంగా ఆ జిల్లాలో గెలుస్తారన్న కీలక నాయకులు ఓటమిచెందడమే కాకుండా ఇప్పుడు జోరుగా వలసలు ప్రారంభం అవ్వడం ఆ పార్టీకి మింగుడుపడడంలేదు.ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసిన బీజేపీ...

Read More..

అసలేమయ్యింది ? విజయసాయిరెడ్డి పదవి ఎందుకు ఊడింది ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తరువాత రెండో స్థానంలో ఉంటూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని లీడ్ చేస్తున్న వ్యక్తి విజయసాయిరెడ్డి.జగన్ కు ఉన్న నమ్మకస్థుల్లో అత్యంత ముఖ్యమైన కీలకమైన వ్యక్తి ఆయన.పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకమైంది...

Read More..

తోలి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా

పార్లమెంట్ లో మొట్టమొదటి మహిళా ఆర్ధిక మంత్రిగా తొలిసారిగా నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించబోతున్నారు.తొలిసారిగా ఒక మహిళ కేంద్ర ఆర్ధిక మంత్రి గా నిర్మలా సీతారామన్ తోలి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు.అయితే ఈ క్రమంలో ఆమె ఎప్పుడూ ఉండే సంప్రదాయాన్ని పక్కన...

Read More..

మొన్న టీటీడీ చైర్మన్,నేడు ఎఫ్ డీసీ చైర్మన్

ఈ సారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం తో ఏపీ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయితే తొలుత ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీ చైర్మన్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు ని నియమించనున్నట్లు వార్తలు...

Read More..

చంద్రబాబు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ?

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు మీద పీకల్లోతు కోపం పెంచుకున్న బీజేపీ ఎట్టకేకలకు మళ్ళీ అధికారం లోకి వచ్చేసింది.ఆ పార్టీ కూడా ఊహించని స్థాయిలో సీట్లు రావడం తో తమకు అడ్డేలేదు అన్నట్టుగా దూకుడుగా ముందుకు వెళ్తోంది.ముఖ్యంగా ఏపీలో బలపడాలని చూస్తున్న...

Read More..

బాబు ఓదార్పు కార్యకర్తల్లో ధైర్యం పెంచుతుందా

నిస్తేజంలో ఉన్న కార్యాకర్తలకు ధైర్యం నూరిపోస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని పెంపొందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను కలుసుకునేందుకు సిద్ధం అయ్యాడు అదీ కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తల మీద...

Read More..

శృతి మించుతున్న వైసీపీ కార్యకర్తలు! జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారుగా

ఏపీలో జగన్ మేనియాతో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాద్యతలు తీసుకున్న తర్వాత జగన్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు.ప్రజాకర్షక విధానాలతో పరిపాలనలో తనదైన ముద్ర వేసి ప్రజల నుంచి మద్దతు...

Read More..

పరువునష్టం కేసు నుంచి బయటపడ్డ కాంగ్రెస్ నేత రాహుల్

పరువు నష్టం కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు ముంబై లోని మెట్రోపాలిటన్ కోర్టు లో హాజరైన సంగతి తెలిసిందే.గౌరీ లంకేశ్ హత్య కేసులో బీజేపీ,ఆర్ ఎస్ ఎస్ లకు సంబంధం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు...

Read More..

అప్పుడే మాట వినడం లేదా ? వారిపై జగన్ గుర్రుగా ఉన్నారా ?

కొత్తగా కొలువై ఉన్న ఏపీ మంత్రి మండలిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.జగన్ క్యాబినెట్ లో ఇప్పటి వరకు ఎవరూ ఊహించని వ్యక్తులు మంత్రిపదవులు దక్కించుకున్నారు.జగన్ క్యాబినెట్ లో బెర్త్ ఖాయం అనుకున్న ఆయన నమ్మకస్థుల్లో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ జగన్ మంత్రులుగా...

Read More..

వేగవంతమైన సిట్ విచారణ వివేకానందరెడ్డి ఇంటి వాచ్ మెన్ కు నార్కో పరీక్షలు

ఏపీ సీఎం జగన్ బంధువు,మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లో అత్యంత దారుణంగా హత్యకు గురైనసంగతి తెలిసిందే.మూడు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు.గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పరచిన సిట్...

Read More..

కేసీఆర్ అంటే ఏంటో జగన్ కు ఇప్పుడు తెలిసొచ్చిందా

కేసీఆర్ – జగన్ ఇద్దరూ రాజకీయ మిత్రులు అన్న సంగతి తెలిసిందే.ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఎంత కృషి చేశాడో అందరికి తెలిసిందే.ఆర్థికంగానూ, రాజకీయంగానూ కేసీఆర్ అందించిన తోడ్పాటు వైసీపీ విజయంలో కీలకం అయిన సంగతి జగన్ కి కూడా...

Read More..

వైసీపీలో నామినేటెడ్ పోస్టుల సందడి ! ఎవరికి ఏ పదవి అంటే ?

ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అంటూ పాటలు పాడుకుంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆశావాహులు.ప్రస్తుతం కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపులు చూస్తున్నవారికి అధినేత జగన్ తీపి కబురు చెప్పబోతున్నాడు.తాజాగా నామినేటెడ్ పదవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్...

Read More..

ఇకపై ప్రాంతీయ భాషల్లో కూడా అందులోబాటులో ఉండనున్న సుప్రీం తీర్పులు

అత్యున్నత న్యాయస్థానం తీర్పులు ఇక ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.సుప్రీం కోర్టు తీర్పులు ఇక ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల సూచన చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రపతి సూచన మేరకు ఈ నెలాఖరు...

Read More..

టిఆర్ఎస్ పై బీజేపీ ఫోకస్ ? దూకుడు స్టార్ట్ అయ్యిందా ?

కేంద్ర అధికార పార్టీ బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ బలపడేందుకు చూస్తోంది.కేంద్రంలో ఎలాగూ అధికారంలో ఉండడంతో పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి బలపడేందుకు ప్రయత్నిస్తోంది.ఆ విధంగానే ఏపీ, తెలంగాణల్లో రాజకీయ చక్రం తిప్పుతోంది.ముఖ్యంగా తెలంగాణ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో...

Read More..

కాంగ్రెస్ భారం వదిలించుకున్న రఘువీరా... పార్టీ మార్పు కోసమేనా

ఏపీ రాష్ట్ర విభజన పాపం నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో పూర్తిగా భూస్థాపితం అయిపొయింది అని చెప్పాలి.ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని వైసీపీ పూర్తిగా ఆక్రమించేసింది.దీంతో కాంగ్రెస్ పార్టీ కనీసం సొంత క్యాడర్ కూడా ఏపీలో లేకుండా...

Read More..

లోకేష్ కి బాద్యతలు అప్పగిస్తే సగానికి పైగా టీడీపీ ఖాళీ

ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో తెలుగు దేశం పార్టీ గడ్డు కాలం ఎదుర్కొంటుంది.వయసు రీత్యా చంద్రబాబు పార్టీ పగ్గాలు వేరొకరికి అప్పగించాల్సిన అవసరం వచ్చింది.విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో, అలాగే ప్రత్యర్ధి పార్టీల ఎత్తులని తిప్పి కొట్టడంలో ఎందుకనో ఎన్నికలలో ఓటమి తర్వాత నిశ్శబ్దానికి...

Read More..

మమత ప్రతిపాదనకు అస్సలు అవకాశం లేదని చెప్పేసిన కేంద్రం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కు పెద్దగా పొసగడం లేదు అన్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా తృణమూల్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రం కి ఒక ప్రతిపాదన...

Read More..

ఎన్టీఆర్ ఫ్యామిలీని చేరదీస్తున్న జగన్ ! ఎందుకంటే ?

ఏపీ సీఎం జగన్ రాజకీయంగా వేస్తున్న ఎత్తులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.తెలుగుదేశం పార్టీ మీద డైరెక్ట్ గా ఎటాక్ ప్రారంభిస్తే రాజకీయంగా విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో తెరవెనుక ఆ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నలు ముమ్మరం చేసినట్టు కనిపిస్తోంది.అది కూడా గతంలో వైఎస్...

Read More..

నటుడు శివాజీ ని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు

టీవీ 9 షేర్లు కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదురుకొంటున్న నటుడు శివాజీ అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది.శంషాబాద్ ఎయిర్ పోర్టు లో శివాజీ ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.టీవీ 9 షేర్లు కొనుగోలు,బోగస్ పత్రాలు వంటి పలు ఆరోపణల నేపథ్యంలో...

Read More..

జేసీ ఫ్యామిలీ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యిందా ?

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఏపీలో బలపడేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన బలమైన నాయకులకు వల వేస్తోంది.ఇప్పటికే టీడీపీలో బాబు కోటరీ నాయకులుగా పేరుపడ్డవారంతా కాషాయ కండువా కప్పేసుకున్నారు.ఇక మిగిలి ఉన్న నాయకులు కూడా అదే బాటలో...

Read More..

లోకేష్ ను మరీ అంతా దూరంపెట్టేస్తున్నారే ?

లోకేష్ బాబు అలియాస్ చినబాబు ! ఈయన హవా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు వెలిగిపోయింది.చంద్రబాబు తరువాత ఆ స్థాయిలో చక్రం తిప్పుతూ తనకంటూ కొంతమంది నాయకులతో కోటరీ ఏర్పాటు చేసుకున్నాడు.ఎమ్యెల్సీగా ఎన్నికై మంత్రిగా అవకాశం కొట్టేసిన లోకేష్ బాబు...

Read More..

కాంగ్రెస్ అద్యక్ష పదవి తనకి వద్దే వద్దు అంటున్న రాహుల్ గాంధీ

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఊహించని పరాభవం ఎదుర్కొంది.రాహుల్ గాంధీ నేతృత్వంలో పని చేసిన కాంగ్రెస్ పార్టీ, మోడీ హవాని బీజేపీ మీద ప్రజలకి ఉన్న నమ్మకాన్ని దూరం చేయలేక పూర్తిగా చతికిల పడ్డాడు.ఈ కారణంగా...

Read More..

భద్రత కుదింపు పై హైకోర్టు ని ఆశ్రయించిన బాబు

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి కల్పించిన భద్రతను కుదించిన సంగతి తెలిసిందే.అయితే ఈ భద్రతా కుదింపు పై చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది హైకోర్టు లో పిటీషన్ దాఖలు...

Read More..

వివాదాస్పదమైన నటుడి నిర్ణయం!

బాలీవుడ్ నటుడు,బీజేపీ నేత అయిన సన్నీ డియోల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమైంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున గురుదాస్ పూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన సన్నీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలో...

Read More..

బీజేపీలో జనసేన విలీనం ? 'మెగా' రాయబారం ఇదేనా ?

మెగా బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయ పార్టీలు పెట్టి సీఎం అవుదామని కలలుకన్నవారే ! అయితే వారికి భారీగా అభిమానులు, ప్రజల్లో గుర్తింపు ఉన్నా ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇద్దరికీ పరాభవమే ఎదురయ్యింది.అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి...

Read More..

తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్ లను నియమించే పనిలో పడ్డ కేంద్రం

తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్ లను నియమించే పనిలో పడింది కేంద్రం.ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలు రెండిటికి కలిపి ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు వేరు వేరుగా గవర్నర్లను నియమించాలి కేంద్ర హోం శాఖ...

Read More..

జగన్ మరీ ఇంత పొదుపు చేసేస్తున్నాడా ?

వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అనేక సంచలనాలే సృష్టిస్తూ వస్తున్నాడు.అసాధ్యం అనుకున్న కార్యక్రమాలను కూడా అమలు చేసి చూపిస్తూ డేరింగ్ సీఎంగా పేరుతెచ్చుకుంటున్నాడు.ఇక జగన్ వ్యవహారశైలి విషయానికి వస్తే ఆయన విలాసాలకు అలవాటు పడ్డ వ్యక్తని,...

Read More..

టీడీపీలో వియ్యంకులదే రాజ్యమా ? కస్సుబుస్సుమన్న'కాపు'నేతలు

కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్న ‘కాపు’ నాయకులు ఎట్టకేలకు అధినేత చంద్రబాబు తో సమావేశం అయ్యారు.కొద్దీ రోజుల క్రితం రెండు మూడు పర్యాయాలు కాకినాడలో సమావేశం అవ్వడం, టీడీపీలో జరుగుతున్న పరిణామాలను గురించి చర్చించడం ఆ సందర్భంగా అధినేత చంద్రబాబు...

Read More..

కుమారస్వామి కి ఝలక్ ఆనంద్ సింగ్ రాజీనామా

కర్ణాటక లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది.ఇప్పటికే జేడీఎస్-కాంగ్రెస్ ల మధ్య చెడింది అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్న ఈ సమయంలో గాలి బ్రదర్స్ అనుచరుడిగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.ఆయన రాజీనామా...

Read More..

వైసీపీ బీజేపీ బంధానికి బీటలుపడుతున్నాయా ?

కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏపీలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, నాయకులూ తప్ప పెద్దగా కార్యకర్తల బలం లేని బీజేపీ పార్టీ ఏపీలో వైసీపీకి ప్రత్యామ్న్యా శక్తిగా ఎదగాలని చూస్తోంది.ప్రస్తుతం టీడీపీ బలహీనపడుతుండడంతో ఆ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుని లాభపడాలని...

Read More..

ఆ మీడియా అంటే టీడీపీకి మొహంమొత్తిందా ?

తెలుగుదేశం పార్టీకి ఉన్న బల, బలాలను లెక్కలోకి తీసుకుంటే ప్రధానంగా కనిపించేది మీడియా బలం.ప్రస్తుతం ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను పరిగణలోకి తీసుకుంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నవే ఎక్కువ.తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం బలహీనత ఆ పార్టీ అనుకూల మీడియానే అన్న...

Read More..

వైసీపీ లక్ష్యంగా బాబు 'ఓదార్పు' ?

‘ఓదార్పు’ ఈ పదం వింటే ముందుగా గుర్తుకువచ్చేది వైఎస్ జగన్.ఓదార్పు యాత్రతో ఎక్కువగా ప్రజల్లో తిరుగుతూ జగన్ ప్రజలతో మమేకం అయ్యాడు.ఇది వైసీపీకి కూడా బాగా కలిసి వచ్చింది.ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి కూడా వచ్చేసింది.అయితే అటువంటి ఓదార్పు యాత్రే చేపట్టి...

Read More..

తెలంగాణా లో మొదలుపెట్టిన బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

ఏపీ లో చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ కి ముసలం వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆ పార్టీ కి చెందిన పలువురు కీలక నేతలు టీడీపీ లోకి జంప్ అయిపోయిన సంగతి తెలిసిందే.బీజేపీ ఆకర్ష్ లో భాగంగా దాదాపు టీడీపీ కి...

Read More..

అటవీశాఖ అధికారి మీద టీఆర్ఎస్ నేత దాడి! ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్

అధికారం మదంతో కనీసం ఆలోచన లేకుండా రాజకీయ నేతలు రెచ్చిపోతూ ఉంటారు.ఒక్కోసారి ప్రభుత్వ అధికారుల మీద ఇష్టానుసారంగా దాడులకి పాల్పడుతూ ఉంటారు.అయితే ఇలాంటి సందర్భాలలో పార్టీ అధిష్టానం తమ నేతలు చేసిన తప్పులని చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది.గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో...

Read More..

టీడీపీ ఆఫీసు లే టార్గెట్...విశాఖ టీడీపీ ఆఫీస్ కు నోటీసులు

ఏపీ లో కూల్చివేతల పరంపర కొనసాగుతుంది.టీడీపీ పార్టీ భవనాలే టార్గెట్ గా వైసీపీ పార్టీ చర్యలు చేపట్టింది.ఇటీవల కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదిక కూల్చివేయగా, మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులు జారీ చేసిన...

Read More..

స్పీడ్ పెంచుతున్న కాంగ్రెస్ ! వర్కవుట్ అవ్వుద్దా ?

తెలంగాణాలో దాదాపు చతికలబడింది అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు జోరందుకుంటున్న సమయంలో వలసలను నివారించి పార్టీని బలోపేతం చేసేందుకు చూస్తోంది.ఈ మేరకు నాగార్జునసాగర్‌లో టీ.పీసీసీ కార్యవర్గ సమావేశంలో నాయకులంతా...

Read More..

అమరావతి కూల్చేద్దాం...హైదరాబాద్ ని అభివృద్ధి చేద్దాం అంటున్న జగన్!

టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత కొద్దీ రోజులుగా పేస్ బుక్ ద్వారా స్పందిస్తూ వస్తున్న నాని ఇటీవల ప్రజావేదిక కూల్చివేత ఘటన పై అలానే ఏపీ సి ఎం జగన్ ను ప్రశ్నిస్తూ కొన్ని పోస్టు...

Read More..

జగన్ నెలరోజుల పాలన ఎలా ఉంది ? అంతా సంచలనమేనా ?

పరిపాలన లో పారదర్శకత, జవాబుదారీతనం ఇలా అన్ని విషయాల్లోనూ జగన్ ప్రజల నుంచి మంచి మార్కులే కొట్టేసాడు.జగన్ అధికారం చేపట్టి నెల రోజులు ముగిసిన సందర్భంగా ఆయన పాలన ఎలా ఉంది అనే విషయంపై విశ్లేషణ మొదలయ్యింది.ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను...

Read More..

విజయ సాయి రెడ్డి కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దేవినేని అవినాష్

ఏపీ లో ఎన్నికలు ముగిసాయి కానీ టీడీపీ,వైసీపీ ల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది.ఏపీ సి ఎం గా వై ఎస్ జగన్ ఎన్నికైన తరువాత టీడీపీ,వైసీపీ పార్టీ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.అప్పటి నుంచి కూడా...

Read More..

ఓ వైపు జగన్... మరో వైపు బీజేపీ! టీడీపీని భూస్థాపితం కోసం

ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ తరువాత ఇంతకాలం ఆ స్థాయిలో తనదైన ముద్ర వేసుకొని తెలుగు ప్రజల కోసం పని చేసిన ప్రాంతీయ పార్టీ తెలుగు దేశం భవిష్యత్తు ఇప్పుడు ప్రస్నార్ధకంగా మారుతుందా అంటే అవుననే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.చంద్రబాబు...

Read More..

స్థానిక సంస్థలని లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్! వాళ్ళే మెయిన్ టార్గెట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కొంత సమయం గ్యాప్ తీసుకొని మరల తన కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే విషయం స్పష్టం చేసాడు.ఇందులో భాగంగా కమిటీలు ఏర్పాటు చేసి వాటి బాద్యతని కూడా...

Read More..

దోమల పేరుతో కోటిన్నర స్వాహా అంటూ టీడీపీ పై సంచలన ఆరోపణలు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ ప్రభుత్వం పై మరోసారి సంచలన ఆరోపణలు చేసారు.సోషల్ మీడియా వేదికగా గత కొద్దీ రోజులుగా ఆ పార్టీ పై,పార్టీ నేతలపై విరుచుకుపడుతున్న విజయసాయిరెడ్డి మరోసారి ఆపార్టీ పై ఆరోపణలు చేశారు.దోమల పేరు చెప్పి...

Read More..

ఇంత జరుగుతున్నా అసలు యజమాని స్పందించడేమి ?

కొద్ది రోజుల క్రితం కృష్ణ నది కరకట్ట మీద అక్రమ నిర్మాణం అంటూ ప్రభుత్వానికి చెందిన ప్రజావేదికను కూల్చివేసిన జగన్ ప్రభుత్వం మిగతా అక్రమ నిర్మాణాల మీద దృష్టిపెట్టింది.ఇప్పటికే గుర్తించిన 25 అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేసింది.అంతే కాదు...

Read More..

ఇక నెక్స్ట్ టార్గెట్ లోకేష్ ? ఆ లావాదేవిపై దృష్టి

‘వైఎస్ జగన్ గారూ అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జి షీట్లు ఉన్నాయి.మీరు నిందితుడిగా జైలులో ఉన్నారు.అయినా మీరు నీతి, నిజాయితీ అంటూ మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌’ అంటూ లోకేష్ విమర్శలు చేశారు.అంతే కాదు ‘మీ బాబు, మా...

Read More..

జగన్ పై 'మెగా' బాణం ? బీజేపీ ప్లాన్ ఇదేనా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి మంచి జోష్ లో ఉంది.151 సీట్లు దక్కడం, అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తూ జగన్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.జగన్ ఐదేళ్లు కాదు, మరో పదిహేనేళ్ళు సీఎం అంటూ వైసీపీ...

Read More..

టీడీపీకి కలవరం పుట్టిస్తున్న కాపు నాయకులు

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మీద ఇంటా బయటా ముప్పేట దాడి జరుగుతోంది.ఒక పక్క అధికార పార్టీ వైసీపీ టీడీపీ అధినేత చంద్రబాబు ని అన్నిరకాలుగా ఇబ్బందిపెట్టాలని చూస్తుంటే మరోవైపు సొంత పార్టీ నేతలు అసమ్మతి రాగం వినిపిస్తూ బెదిరింపు ధోరణికి దిగడం...

Read More..

జగన్ భగీరథ ప్రయత్నం! మరో జలయజ్ఞంకి సిద్ధం

ఆకాశం నుంచి గంగని భూమికి తీసుకొచ్చిన అపర భగీరథుడు వారసులుగా నేటి భారతంలో చాలా తక్కువ మంది ఉన్నారు.వృదాగా పోతున్న గోదావరి జలాలని ఒడిసిపట్టి కోస్తా జిల్లాలలో లక్షల ఎకరాలకి నీరు అందించి, ఏడాదికి రెండు పంటలు పండించుకోవడానికి కారణం అయిన...

Read More..

మరో ఆరు నెలల పాటు అక్కడ రాష్ట్రపతి పాలన పొడిగింపు

జమ్మూ అండ్ కాశ్మీర్ లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.దీనికి సంబందించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికై హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్...

Read More..

మాజీ మంత్రి లోకేష్ సెన్సేషనల్ ట్వీట్..ఏంటంటే!

టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.ట్వీట్ల రూపంలో ఒకరిపై నొకరు పంచ్ లు వేసుకుంటూనే ఉన్నారు.ఈ క్రమంలోనే మాజీ మంత్రి నారా లోకేష్ సెన్సేషనల్ ట్వీట్ ఒకటి చేశారు.ఒక ఆడియో ఫైల్ ని లోకేష్ ట్వీట్ చేశారు.అయితే ఆ...

Read More..

ప్రగతి భవన్ లో భేటీ అయిన తెలుగు రాష్ట్రాల సీఎం లు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ల మధ్య సమావేశం ప్రారంభమైనట్లు తెలుస్తుంది.ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీ ఎం జగన్ తన మంత్రుల బృందం తో కలిసి నిన్ననే అక్కడకి చేరుకున్నారు.ఈ...

Read More..

మొన్న ప్రజావేదిక, రేపు చంద్రబాబు నివాసం

కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడం అంటూ ఏపీ సర్కార్ కూల్చివేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు జగన్ సర్కార్ దృష్టి మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ పై పడింది.ఈ క్రమంలో ఆ...

Read More..

పవన్ కు వచ్చిన క్లారిటీ బాబు కి ఎప్పుడొస్తుందో ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు, టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయిపొయింది.ఇక కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జనసేన పార్టీ అయితే ఒక్కటంటే ఒక్క సీటుకే పరిమితం అయిపొయింది.ఈ పరిణామాలు అసలు ఎవరూ ముందుగా ఊహించనేలేదు.టీడీపీ సంగతి...

Read More..

బాబు మౌనం వెనుక ఇంత రాజకీయం ఉందా ?

తెలుగుదేశం పార్టీలో అల్లకల్లోలం జరుగుతున్నా, ఏపీ సీఎం జగన్ టీడీపీ టార్గెట్ గా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నా, టీడీపీలో కీలక నాయకులు అనుకున్నవారంతా బీజేపీ గూటికి వెళ్లిపోతున్నా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏమాత్రం స్పందించడంలేదు.నాలుగుదశాబ్దాల ఘన చరిత్ర ఉన్న...

Read More..

కోపం లేదు అంటూనే జగన్ కసి తీర్చుకుంటున్నాడా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి ఒకటే మాట చెప్తూ వస్తోంది.తమకు ఎవరి మీదా కక్షలు లేవని, ఎవరి మీద ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదని చెప్తూ వస్తోంది.అదే సమయంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విపరీతమైన అవినీతి...

Read More..

హరీష్ రావు కు మంత్రి పదవి ఏ శాఖ ఇస్తున్నారంటే ?

సోషల్ మీడియా పుణ్యమా అని తెలంగాణాలో టీఆర్ఎస్ నాయకుడు, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.ఇటీవల తెలంగాణాలో అతి భారీ ప్రాజెక్ట్ గా పేరుపడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యింది.ఆ కార్యక్రమానికి అతిరధమహారాదులంతా హాజరయ్యారు.కానీ ఆ ప్రాజెక్ట్ కోసం...

Read More..

హర్యానా లో దారుణం కాంగ్రెస్ నేత దారుణ హత్య

హర్యానా లో దారుణ ఘటన చోటుచేసుకుంది.పట్టపగలు కాంగ్రెస్ నేతను ఎవరో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు.గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.హర్యానా కు చెందిన కాంగ్రెస్ నేత వికాస్ చౌదరి గురువారం ఫరీదా బాడ్ లో జిమ్...

Read More..

ఏంటమ్మా మీ ప్రాబ్లెమ్ : అసంతృప్తులపై బాబు దృష్టి

తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి ముదిరిపోతుంది.ఒకవైపు కేంద్ర అధికార పార్టీ బిజెపి టిడిపి కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెలుగుదేశాన్ని దెబ్బతీయడంతో పాటు, రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీకి బలమైన పునాదులు వేసేందుకు ప్లాన్ చేస్తోంది.మరో...

Read More..

టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన విజయసాయి రెడ్డి

పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.కృష్ణా నది ఒడ్డున కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అది అక్రమ కట్టడం అని,దానిని కూల్చివేయాలని...

Read More..

'రాములమ్మ' రాజకీయ అడుగులు ఎటువైపు ?

లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుపొందిన తెలంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ పొలిటికల్ కెరియర్ గందరగోళంలో పడినట్టుగా కనిపిస్తోంది.తెలంగాణ కాంగ్రెస్ లో ఆమె ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాకపోవడం, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో...

Read More..

చినబాబు వద్దే వద్దు ! గొంతు పెంచుతున్న తెలుగు తమ్ముళ్లు

ప్రస్తుతం రాజకీయంగా చూస్తే టీడీపీ పుట్టెడు కష్టాల్లో ఉన్నట్టే కనిపిస్తోంది.ఒకవైపు జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే మరోవైపు పార్టీ నాయకులు చేజారిపోకుండా చూసుకునేందుకు అధినేత చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.ఏది ఏమైనా పార్టీలో ప్రస్తుతం నెలకొన్న నిస్తేజాన్ని పూర్తిగా తొలగించాలని బాబు చూస్తున్నాడు. ఒకవైపు...

Read More..

వైసీపీ పార్టీ పై సెటైర్లు వేసిన కేశినేని నాని

ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు.గత కొంత కాలంగా టీడీపీ పై అసంతృప్తి తో ఉన్న ఆయన పెద్దగా ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవడం లేదు.అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ...

Read More..

బాబుకి హ్యాండ్ ఇస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు! ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసారా

టీడీపీ పార్టీ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి టీడీపీ నేతలు క్యూ కట్టడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరిపోగా వారి దారిలోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు...

Read More..

టీడీపీ ముఖ్య నేతలతో బాబు కీలక భేటీ, గైర్హాజర్ అయిన కాపు నేతలు

ఏపీ రాజకీయాలలో ఇటీవల పెను పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఇటీవల జరిగిన ఎన్నికల తరువాత ఘోర ఓటమి ని చవిచూసిన టీడీపీ పార్టీ రోజు రోజుకు పతనమయ్యే స్థితి కి పడిపోతుంది.మొన్నటికి మొన్న టీడీపీ పార్టీ కి చెందిన ఎంపీ లు బీజేపీ లో...

Read More..

అధికార గర్వం తో రెచ్చిపోయిన ఎమ్మెల్యే మున్సిపల్ ఉద్యోగి పై దాడి

అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అన్న ధైర్యం రాజకీయ నేతలో బాగా పేరుకుపోతుంది.కేంద్రం లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం లోకి వచ్చింది అన్న కారణమో మరేదో కారణమో తెలియదు కానీ బీజేపీ కి చెందిన ఒక ఎమ్మెల్యే రౌడీలా...

Read More..

అన్నీ కూల్చివేస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది అంటున్న పవన్

గత ప్రభుత్వం హయం లో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది కరకట్ట వద్ద ప్రజావేదిక నిర్మాణం జరిగింది.అయితే ఈ నిర్మాణం అక్రమ కట్టడం అని వైసీపీ పార్టీ ఆరోపిస్తూ ఇప్పుడు...

Read More..

జనసేన వేదిక అయ్యేది కొత్త తరానికా... పాత కాపులకా!

ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగే ప్రయత్నం చేసిన జనసేన పార్టీకి ఏపీలో ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది.అయితే ప్రజాతీర్పుని గౌరవించి పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకి వెళ్తున్నాడు.తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలని ద్రుష్టిలో ఉంచుకొని...

Read More..

తోలి బడ్జెట్ సమావేశాలకు సిద్దమౌతున్న వైసీపీ సర్కార్

ఏపీ లో కొత్త గా వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది.ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ల ప్రమాణ స్వీకారం,స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎన్నిక,అలానే గవర్నర్ ప్రసంగం, ఆయన ప్రసంగానికి ధన్యవాద...

Read More..

ఇలా చేస్తే ఏపీలో 'కమలం' చిగురించడం కష్టమేనా ?

కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఏపీలో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.అన్ని పార్టీల నాయకులకు గేలం వేస్తూ బలపడి వచ్చే ఎన్నికల నాటికైనా పదుల సంఖ్యలో సీట్లు సాధించాలని చూస్తోంది.బీజేపీ ద్రుష్టి కేవలం ఏపీ మీదే కాదు, దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ...

Read More..

హమ్మయ్య జగన్ ఇరుక్కున్నాడు ! టీడీపీ ఖుషియేనా ?

రాజకీయాల్లో ఎప్పుడూ తమ బలం కంటే ప్రత్యర్థి బలహీనతల మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది.పొరపాటున ఏదైనా విషయంలో వారు దొరికారో దాన్ని బట్టి ఓ ఆట ఆడేసుకుంటారు.ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేవే.ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది.జగన్ దూకుడు నిర్ణయాలు తీసుకున్నా...

Read More..

ప్రజావేదిక కూల్చివేతపై వైసీపీ కి సూచనలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ

ఇటీవల ఏపీ రాజకీయాల్లో ప్రజావేదిక అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.గత ప్రభుత్వ హయం లో నిర్మించిన ఈ కట్టడం అక్రమంగా కట్టారని ఆరోపిస్తూ వైసీపీ సర్కార్ తాజాగా ఈ కట్టడాన్ని కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ కూల్చి వేతపై బీజేపీ...

Read More..

ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు

ఉండవల్లి లోని కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడం అని దానిని కూల్చివేస్తామని ఏపీ జగన్ సర్కార్ పేర్కొన్న విషయం తెలిసిందే.అయితే ఈ ప్రజావేదికను కూల్చవద్దు అంటూ కూల్చివేతపై స్టే విధించాలి అని కోరుతూ శ్రీనివాస్ అనే వ్యక్తి పిటీషన్...

Read More..

బీజేపీ లో చేరిక పై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే ఆయన గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్న...

Read More..

డిప్యూటీ స్పీకర్ పైనే శివసేన చూపు

లోక్ సభ స్పీకర్ గా ఇటీవల బీజేపీ ఎంపీ రాజస్థాన్ నేత ఓం బిర్లా ఎన్నికైన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎవ్వరు అన్న విషయం పై ఇంకా తర్జన భర్జన పడుతున్నారు.డిప్యూటీ స్పీకర్ ఎవరికీ ఇవ్వాలి అని బీజేపీ...

Read More..

పుండు మీద కారం చల్లుతున్న ఏపీ సర్కార్...బాబు కుటుంబ భద్రత కుదింపు

పుండు మీద కారం చల్లినట్లు ఏపీ సర్కార్ తీరు తయారైంది.ఒకపక్క ఓటమి భారం తో తలమునకలు అవుతుంది, మరో పక్క పార్టీలో జంప్ జిలాని లతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పి గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మాజీ...

Read More..

ఆ నిర్ణయంతో జగన్ చిక్కుల్లో చిక్కుకున్నట్టేనా

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో ఆయన పలుకుబడిని అమాంతం పెంచేసింది.ఎటువంటి క్లిష్టమైన నిర్ణయమైనా క్షణాల్లో దానికి ఒక పరిష్కారం చూపిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ జగన్ డైనమిక్ సీఎంగా పేరు తెచ్చుకుంటున్నాడు.అయితే ఇదే...

Read More..

బీజేపీలోకి చిరంజీవి ? త్వరలో కీలక నిర్ణయం !

దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు ప్రాంతీయ పార్టీలకు మింగుడుపడడంలేదు.ఒకపక్క ఏపీలో జగన్ పార్టీతో, తెలంగాణాలో కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో బలపడేందుకు తెర వెనుక పావులు కదుపుతూ ముచ్చెమటలు పట్టిస్తోంది.ఇప్పటికే ఏపీలో...

Read More..

బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణా సీఎం ఆయనేనట!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి సంబందించిన ఆడియో ఒకటి ఇప్పుదు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇటీవల ఎంపీ గరికపాటి పార్టీ ఎందుకు మారారు అని అంటూ ఒక అభిమాని ఫోన్ కాల్ లో ప్రశ్నిస్తే సమాధానము చెప్పిన విషయం తెలిసిందే.అయితే...

Read More..

జగన్ విజయం తో పీకే జీవితమే మారిపోయింది

ఒకప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ కు వెనకుండి నడిపించి విజయాన్ని అందించిన పీకే కి మంచి క్రేజ్ వచ్చింది.అయితే కొద్దీ రోజుల పాటు ఆ క్రేజ్ ఉన్నా ఆ తరువాత పరిస్థితులు అన్నీ మళ్లీ మారిపోయాయి.అయితే జగన్ మాత్రం పీకే...

Read More..

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన ఆర్ధిక మంత్రి

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికలలో హామీ ఇచ్చిన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేసింది.ఓ రెండేళ్ళు కాలయాపన చేసి తరువాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏదో ముష్టిలా కొంత సొమ్ము ఏపీకి విదిల్చిన బీజేపీ పార్టీ...

Read More..

టీడీపీ ఓటమికి వారే కారణం అంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

వైసీపీ ప్రభంజనంలో గత అధికార పార్టీ తెలుగు దేశం ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 25 సీట్లకే టీడీపీ పరిమితం అయిపొయింది.ఓ విధంగా ఇంత ఘోరమైన ఓటమిని టీడీపీ నేతలు, అధినేత చంద్రబాబు కూడా ఊహించలేదు.తాము చేసిన సంక్షేమ...

Read More..

పవన్ తో అరగంట పాటు చర్చించిన వంగవీటి రాధా కారణం

టీడీపీ నేత వంగవీటి రాధా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్లు తెలుస్తుంది.సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ లో ఉన్న వంగవీటి రాధా ఉద్వేగం తో మాట్లాడుతూ నాకు గౌరవం లేని చోట నేను...

Read More..

ఏపీ లో టీడీపీ కి మరో భారీ పంక్చర్...పార్టీని వీడనున్న అంబికా కృష్ణా

ఏపీ లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి ఆ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతూ కనీసం కోలుకొనే సమయం కూడా లేకుండా నానా ఇబ్బందులు పడుతుంది.ముహూర్త బలమో లేదా మరేదైనా కారణమో తెలియదు...

Read More..

టి. పీసీసీ రథసారధి ఎవరో ? రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి ?

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఆ పార్టీ వచ్చే ఎన్నికలనాటికి బరిలో ఉంటుందా అనే అనుమానం కలగక మానదు.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో ఉనికి కోల్పోగా అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా వచ్చినట్టు కనిపిస్తోంది.ఒక పక్క బీజేపీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలు...

Read More..

పవన్ అస్సలు తగ్గడంలేదు కదా ఏం చేస్తున్నాడంటే

ఏపీలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంతా భావించారు.ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ చరిష్మా కనీసం 30 నుంచి 35 సీట్లు సాధించేందుకు దోహదం చేస్తుందని అప్పుడు ఏపీలో కీ...

Read More..

బీజేపీ నిర్ణయం జగన్ కు చిక్కులు తెస్తోందా

కేంద్ర అధికార పార్టీ బీజేపీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ మధ్య రాజకీయ స్నేహం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఏపీలో ఎన్నికల ముందు నుంచి జగన్ అండ్ కో బృందం బీజేపీ నాయకులతో టచ్ లో ఉంటూ వచ్చారు.ఎన్నికల సందర్భంగా బీజేపీ కూడా...

Read More..

లోటు బడ్జెట్ రాజధాని నిర్మాణం జగన్ ఎదురుగా ఉన్న పెద్ద సవాళ్లు

ఏపీ రాజకీయాలలో ఊహించని రీతిలో అఖండ విజయం సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా మొదటి రోజు నుంచే తన మార్క్ చూపించే ప్రయత్నం మొదలుపెట్టాడు.తాను ప్రజలకి హామీ ఇచ్చిన నవ రత్నాలు మీద ముందుగా...

Read More..

అయితే ఎన్టీఆర్... కాదంటే బ్రహ్మాణి కావాలి అంటున్న తెలుగు తమ్ముళ్ళు

ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.ఇంత కాలం తన తెలివి తేటలతో అన్ని పార్టీలని ఆడుకున్న చంద్రబాబుకి ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీల ఎత్తులు, పై ఎత్తులు అర్ధం కాక పార్టీని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక...

Read More..

ఆ విషయంలో ఫుల్ క్లారిటీ గా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ

ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ పెట్టి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్.ఎన్నికల ముందు జనసేన పార్టీ లోకి చాలామంది నేతలు వచ్చినా కూడా అందులో విశాఖపట్నం నుంచి జనసేన పార్టీ ఎంపీగా పోటీ చేసిన మాజీ...

Read More..

నోటి మాటతోనే టెండర్ పనులు అప్పగించిన మంత్రి నారాయణ!

ప్రజావేదికను తమకు కేటాయించాలి అని కోరుతూ ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి తోలి లేఖను రాసిన సంగతి తెలిసిందే.జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత బాబు తోలి లేఖను సీఎం...

Read More..

హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడా ? అందులో కేసీఆర్ పాత్ర ఏంటి ?

తెలంగాణాలో ఇప్పుడు చర్చంతాహరీష్ రావు చుట్టూనే జరుగుతోంది.టీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా హరీష్ ప్రాధాన్యం తగ్గుతూ రావడం, ఆయనకు సరైన రాజకీయ ప్రాధాన్యం కల్పించలేదు.కనీసం పార్టీ పదవులు ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు.చివరికి రాత్రీ పగలు తేడా లేకుండా దగ్గరుండి మరీ...

Read More..

అప్పులపాలైన ఆ సినీ రాజకీయ ప్రముఖుడు

సినిమా రంగంలో వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకుని రాజకీయాలలో గుర్తింపు సంపాదించాలని, రాజకీయ నాయకుడిగా, ప్రజలతో ఆమోదముద్ర వేయించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర పరిపాలకుడిగా మారాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు.తెలుగు తమిళ రాజకీయాలలో సినిమాలకి, రాజకీయాలకు అవినాభావ...

Read More..

ఎన్ని చేసిన ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు అంటున్న విశ్లేషకులు

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా దారుణమైన పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ అఖండ విజయం సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చింది.దీంతో ఇప్పుడు టిడిపి పార్టీ నేతల్లో ఒక రకమైన నైరాశ్యం ఏర్పడింది.కేవలం...

Read More..

మంత్రి పదవి అడుక్కుంటున్న గోవా ఎమ్మెల్యే...కనీసం చెత్తకైనా మంత్రిని చేయండి

మీరు చదువుతుంది కరక్టే.ఎమ్మెల్యే గారు తనకు మంత్రి పదవి కావాలని గోవా సీ ఎం ప్రమోద్ సావంత్ ను కోరారట.నాకు పెద్ద పెద్ద మంత్రి పదవులు అవసరం లేదు కనీసం చెత్త కైనా నన్ను మంత్రిగా నియమించాలి అంటూ వేడుకుంటున్నారట.విషయం కేబినెట్...

Read More..

టీడీపీ పై మరోసారి ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి

రాజ్యసభ టీడీపీ ఎంపీలు ఇటీవల బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.ఒకపక్క నలుగురు ఎంపీలు బీజేపీ లో చేరడం తో ఇంకా ఎంతమంది ఫిరాయింపులకు పాల్పడతారో అన్న టెన్షన్ లో ఉండగా, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్...

Read More..

కాలినడకన తిరుమల వెళ్లి టీటీడీ చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ చైర్మన్ గా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి భాద్యతలు తీసుకున్నారు.గత ప్రభుత్వ హయాంలో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా తన పదవికి రాజీనామా చేయడం తో ఆ స్థానంలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని...

Read More..

పాపం లిఫ్ట్ లో అర్ధగంట పాటు ఇరుక్కున్నతెలంగాణా మంత్రి

తెలంగాణా సీ ఎం కేసీఆర్ శుక్రవారం బృహత్కరమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏపీ సీ ఎం జగన్, అలానే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా హాజరయ్యారు.అయితే సీ ఎం జగన్ తో పాటు...

Read More..

అయ్యో హరీష్ ! సానుభూతి ఓ రేంజ్ లో ఉందే

తెలంగాణాలో ఇప్పుడు సానుభూతి వర్షం కురుస్తోంది.అయ్యో హరీష్ అన్నా అంటూ ఫేస్ బుక్, వాట్సాప్ లలో పోస్టింగ్స్ పెట్టేస్తున్నారు.టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత మెయిన్ పిల్లర్ గా ఆయన మేనల్లుడు తన్నీరు హరీష్ రావు వ్యవహరించారు.అయితే ఇప్పుడు హరీష్ రావు హవా...

Read More..

ఈ కాపు నేతలంతా టీడీపీకి కాకపుట్టిస్తున్నారే ?

తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు ప్రస్తుతం తలెత్తుతున్న పరిణామాలు అర్ధంకావడంలేదు.ఒక పక్క పార్టీ అధికారం కోల్పోవడం మరో పక్క ఆపరేషన్ ఆకర్ష్ అంటూ బీజేపీ టీడీపీ నాయకులకు వల వేయడం ఇవన్నీ గందరగోళంగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే టీడీపీ కి చెందిన రాజ్యసభ సభ్యులు...

Read More..

మోదీకి జగన్ కు మధ్య బాబు పొగ పెట్టాలనుకుంటున్నాడా ?

రాజకీయ ఎత్తులు ఒక్కొక్కసారి ఎవరికి అర్ధం కావు.ప్రత్యర్థులు ఎంతటి బలవంతులు అయినా సరే వారిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కాచుకుకూర్చుంటారు.అంతిమంగా కావాల్సింది ప్రత్యర్థుల పతనం తమ విజయం.ఇప్పుడు ఈ విధంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతానికి కేంద్ర అధికార...

Read More..

బాబు లేఖను పట్టించుకోని వైసీపీ సర్కార్...ప్రజా వేదిక స్వాధీనం కి ఆదేశం

అధికారం కోల్పోయిన తరువాత టీడీపీ పార్టీ పరిస్థితి మనుగడ కూడా కోల్పోయే పరిస్థితుల్లో పడిపోతుంది.రోజు రోజుకి ఆ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.నిన్న రాజ్యసభ టీడీపీ ని బీజేపీ లో విలీనం చేయమంటూ జంప్ జిలానీ లు...

Read More..

పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టారంటున్న నాగబాబు

ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏపి ప్రజల నుంచి ఊహించని షాక్ తగిలింది అనే విషయం అందరికీ తెలిసిందే.కేవలం ఏపీ మొత్తం...

Read More..

ఉపశమన చర్యలు చేపడుతున్న టిడిపి నేతలు

ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా టిడిపి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరి, టి జి వెంకటేష్ ఉన్నఫలంగా పార్టీ కండువా మార్చేసి బిజేపిలోకి జంప్ అయిపోయారు.ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బిజెపిలో వీరు చేరిక సంచలనంగా మారింది అని...

Read More..

ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ గా నరేంద్ర మోడీ

తాజాగా దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి తన సామర్థ్యంతో ఘన విజయం సొంతం చేసుకున్న నేత ప్రధాని నరేంద్ర మోడీ.తన నాయకత్వ పటిమతో బిజెపిని ముందుండి నడిపి ఊహించని విధంగా మరోసారి దేశ ప్రజల మనసు దోచుకున్న ప్రధాని...

Read More..

రాష్ట్రపతి ప్రసంగం సమయంలో ఫోన్ చూస్తున్న రాహుల్..మండిపడుతున్న నెటిజన్లు

పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరించే తీరు ఒక్కోసారి వివాదాస్పద మౌతున్న సంగతి తెలిసిందే.గతంలో సభలో ప్రధాని నరేంద్రమోడీ ని హగ్ చేసుకోవడం వివాదాస్పదం కాగా, ఇప్పుడు తాజాగా రాహుల్ మరో వివాదంలో చిక్కుకున్నారు.పార్లమెంట్ ఉభయసభలను ఉద్దే...

Read More..

లోక్ సభ లో త్రిపుల్ తలాక్ బిల్లు...వ్యతిరేకించిన ఆ రెండు పార్టీలు

ఇటీవల పార్లమెంట్ లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును సభలో ప్రవేశపెట్టింది.తలాఖ్ అని మూడుసార్లు చెప్పి భార్యకు విడాకులు ఇచ్చేసినట్లే అంటూ ఉన్న ముస్లిం సంప్రదాయానికి ఇక ఫుల్...

Read More..

తమిళనాడు పరిస్థితి పై జాలిపడ్డ కేరళ సర్కార్...సాయం వద్దన్న తమిళనాడు

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో నీటి కొరత విపరీతంగా పెరిగిపోయింది.టోకెన్స్ ఇచ్చి మరి నీళ్ల ను జనాలు కొనుక్కోవాల్సిన పరిష్టితి ఏర్పడడం తో ఆ రాష్ట్రం నీటి ఎద్దడి తో బాగా అల్లాడుతోంది.రాజధాని చెన్నై కు నీటిని సరఫరా చేసే అన్ని రిజర్వాయర్లు...

Read More..

హోమం కార్యక్రమాల్లో నిమగ్నమైన కేసీఆర్ దంపతులు

తెలంగాణా లో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది.ఈ ప్రాజెక్ట్ కారణంగా దాదాపు 12 జిల్లాల ప్రజల కు నీటిని అందించే బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ సి ఎం కె చంద్రశేఖర్ రావు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.కాళేశ్వరం...

Read More..

బుద్ధా సంచలన వ్యాఖ్యలు, పదవుల కోసం బాబు గొంతు కూడా కోస్తారు!

ఇప్పటికే తెలంగాణా లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ పార్టీకి, ఏపీ లో కూడా అస్తమయమయ్యే పరిస్థితితులు కనిపిస్తున్నాయి.ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు బీజేపీ లో చేరడం తో ఆ పార్టీ అయోమయం లో పడింది.ఏపీ లో టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది...

Read More..

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు ! బాబు హస్తం ఉందా ?

ఎట్టకేలకు టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు కాషాయ కండువా కప్పేసుకున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నయలమంచిలి వెంకట సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోయారు.అయితే వీరంతా బాబు సూచనా...

Read More..

జూనియర్ ఎన్టీఆర్ ను జగన్ ఇలా వాడుకోవాలనుకుంటున్నాడా ?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కష్టకాలం నడుస్తుండడం, చంద్రబాబు వయస్సు మీరడంతో బాబు తరువాత పార్టీని లీడ్ చేసి ముందుకు నడిపించే నాయకుల కోసం కింది స్థాయి నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు.ఈ క్రమంలో అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగింది.టీడీపీ పూర్తి బాధ్యతలు...

Read More..

జగన్ మీద అసంతృప్తి ఈ రేంజ్ లో ఉందా ?

ఏపీలో కొత్తగా కొలువుతీరిన వైసీపీ ప్రభుత్వం పై అప్పుడే అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతున్నాయి.అయితే ఈ అసంతృప్తులన్నీ సొంత పార్టీ నేతల నుంచే కావడంతో అధిష్టానం కక్కలేక మింగలేక అన్నట్టుగా ఈ వ్యవహారాలన్నీ బయటకి రాకుండా జాగ్రత్త పడుతుంది.ఇంతకీ పార్టీలో నాయకులు అసంతృప్తి...

Read More..

వై ఎస్ వివేకానంద రెడ్డి విషయంలో...సిట్ బృందాన్ని మార్చిన ఏపీ సర్కార్

ఎన్నికల కు కొద్దీ రోజుల ముందు అనగా మార్చి 15 న మాజీ సీ ఎం,దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ఏపీ నూతన సి ఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వై ఎస్ వివేకానంద...

Read More..

వరుసగా గన్ మెన్ లను వెనక్కి పంపుతున్న టీడీపీ నేతలు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఏపీ నూతన సీ ఎం జగన్ మాజీ ఎమ్మెల్యే లకు,మంత్రులకు కేటాయించిన గన్ మెన్ లను కుదించాలి అని అనుకోవడం ఇలా ఈ ఘటన నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు తమకు...

Read More..

కమలం గూటికి టీడీపీ రాజ్యసభ సభ్యులు ?

తెలుగుదేశం పార్టీ అంటే పీకల్లోతు కోపం పెంచుకున్న బీజేపీ అగ్ర నాయకత్వం ఏపీ లో ఆ పార్టీకి మనుగడ లేకుండా చేయాలని చూస్తోంది.దీనిలో భాగంగానే ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ పధకానికి తెరతీయాలని చూస్తోంది.ఇప్పటికే టీడీపీకి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యులు,ఓ ఐదుగురు...

Read More..

నోరు అదుపులోలేక పోవడం తో వేటుకు గురైన కాంగ్రెస్ నేత

నోరు అదుపులో లేకపోతే ఎంత నష్టం కలుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసు.అందులోనూ రాజకీయ నేతలు నోటిని తమ అదుపులో ఉంచుకోక పొతే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే.సరిగ్గా కర్ణాటక లో ఒక కాంగ్రెస్ నేతకు నోటి దూల కారణంగా పార్టీ వేటుకు గురయ్యారు.కర్ణాటక కాంగ్రెస్...

Read More..

కోడెల కుటుంబంపై కేసులు ! టీడీపీ పట్టించుకోదా ?

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు, ఆయన కుమారుడు, కుమార్తె మీద కేసులు నమోదయ్యాయి.ఇంకా అనేకమంది తాము కూడా బాధితులమే అంటూ అనేకమంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.వారి ఫిర్యాదుల...

Read More..

17 వ లోక్ సభ స్పీకర్ గా ఎంపీ ఓం బిర్లా ఎన్నిక

17 వ లోక్ సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికైనట్లు తెలుస్తుంది.గత కొద్దీ రోజులుగా లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారు అంటూ వచ్చిన వార్తలకు తెరదించుతూ ఓం బిర్లా పేరును ఖరారు చేసింది.ఓం...

Read More..

ఈ బ్రదర్స్ లొల్లి ఇంకా తేలేలా లేదేమి ?

తెలంగాణాలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ లొల్లి ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడంలేదు.అన్న ఒక పార్టీ తరుపున ఒకంతా పుచ్చుకుంటే తమ్ముడు మరో పార్టీ తరపున ఒకంతా పుచ్చుకుని రాజకీయం చేస్తున్నాడు.అయితే ఈ బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఆడుతున్న పొలిటికల్ డ్రామా ఇది అంటున్నవారు...

Read More..

విదేశీ పర్యటనలో బాబు...అఖిలపక్ష సమావేశానికి గైర్హాజర్

ఏపీ మాజీ సీ ఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తుంది.ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తరువాతే ఈ పర్యటన ఉండాల్సి ఉండగా, ఓటమి పై విశ్లేషణలు చేసుకుంటూ ఇప్పటివరకు పొడిగించుకున్నారు.ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్...

Read More..

'పరిటాల' ఫ్యామిలీ పార్టీ మారాలనుకుంటుందా ?

తెలుగుదేశం పార్టీలో ‘పరిటాల’ కుటుంబానికి ఉన్న గుర్తింపే వేరు.మొదటి నుంచి టీడీపీతో పరిటాల రవి అనుబంధం కొనసాగిస్తూ వచ్చారు.ఆయన హత్య అనంతరం ఆ కుటుంబాన్ని టీడీపీ కూడా బాగానే ఆదరించింది.రాప్తాడు నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన పరిటాల సునీతకు మంత్రి పదవి...

Read More..

కొత్త పార్టీ స్థాపించి కొద్ది రోజుల్లోనే బీజేపీలోకి! మాజీ ఎంపీ సంచలనం

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్యకాలంలో బీజేపీలోకి వెళ్ళే వారి నేతల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.బీజేపీ పార్టీ కూడా తెలుగు రాష్ట్రాలలో బలంగా పార్టీని విస్తరించడానికి గట్టి కసరత్తు చేస్తుంది.అందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలని టార్గెట్ చేసిన...

Read More..

రహస్య సర్వేలతో కేసీఆర్ బెంబేలెత్తిస్తున్నాడా ?

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఇప్పట్లో ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు.దాదాపు నాలుగున్నరేళ్ళపాటు నిరాటంకంగా పరిపాలన మీద దృష్టిపెట్టవచ్చు.కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ విషయాలకంటే మరేదో విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే ఇప్పుడు రహస్యంగా ఎమ్యెల్యేలు, మంత్రుల...

Read More..

జగన్ నిర్ణయాలు మంత్రులకు నచ్చడంలేదా ?

ఏపీలో అధికారం దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మంత్రి మండలి ఏర్పాటులో కూడా సామజిక సమీకరణాల లెక్కలు పక్కాగా వేసుకుని మరీ మంత్రి మండలి ఏర్పాటు చేసింది.ఈ లెక్కల్లో జగన్ చూపించిన లాజిక్ అందరి ప్రశంసలు అందుకుంది.జగన్ కు అత్యంత సన్నిహితులను...

Read More..

ఆ క్రెడిట్ హరీష్ కు దక్కకుండా అడ్డుపడుతుంది ఎవరు ?

అభివృద్ధిలో ఎంతవేగంగా తెలంగాణాని పరుగులు పెట్టించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతగా కృషి చేస్తున్నాడో అంతే స్థాయిలో విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నాడు.ముఖ్యంగా పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో తీవ్రంగా కృషి చేసిన వ్యక్తులను పక్కన పెట్టడం పార్టీలో నాయకులకు రుచించడంలేదు.ఇక విషయంలోకి...

Read More..

ఇదేంటి తమ్ముళ్లూ : టి.టీడీపీ ఇక లేనట్టేనా ?

ఏపీలో అధికారం పోగుట్టుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణ లో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు లేక దిక్కుతోచని స్థితిలో తెలంగాణ తమ్ముళ్లు పక్క చూపు చూస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం...

Read More..

ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఆ రకంగా పోల్చిన సిపిఐ నారాయణ

రాజకీయాలలో ఫిరాయింపులు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయాయి.ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచి తర్వాత అధికారంలో ఉన్న పార్టీలోకి చాలామంది నేతలు తమ స్వలాభం కోసం వెళ్ళిపోతున్నారు.దానికి వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీ లోకి వెళ్తున్నట్లు కథలు చెబుతున్నారు.అయితే...

Read More..

కోమటిరెడ్డి బ్రదర్స్ పై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హెచ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హెచ్ సంచలన ఆరోపణలు చేశారు.కేవలం కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ లోకి వెళుతున్నారని, ఆయన...

Read More..

ఏపీ కి వచ్చిన కేసీఆర్

తెలంగాణ సిఎం కేసీఆర్ ఏపీ కి బయలుదేరి వచ్చారు.సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యెక్ విమానంలో బయలుదేరి వచ్చిన సీ ఎం కేసీఆర్ ముందుగా విజయవాడ లోని కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వేదపండితులు,ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో...

Read More..

జంపింగ్ జిలానీలు ఎవరో బాబు కి తెలిసిపోయిందా ?

గత కొద్దీ రోజులుగా ఏపీ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది టీడీపీకి చెందిన సుమారు పదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైసీపీలోకి జంపింగ్ చేయాలనీ చుస్తున్నారనే విషయమే.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ బాబు ని ఉద్దేశించి...

Read More..

సీ ఎం జగన్ కాన్వాయ్ లో మార్పులు...కొత్తగా 6 బ్లాక్ ఫార్చ్యూనర్స్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనాల్లో మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.ఆయన కాన్వాయ్ లో కొత్తగా 6 నలుపు రంగు ఫార్చ్యూనర్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు సీఎం భద్రతా అధికారులు వెల్లడించారు.AP39 PA 2345 నెంబర్‎తో కొత్త వాహన శ్రేణి ఉంటుందని...

Read More..

మోడీ రెండోసారి ప్రధాని అయిన తరువాత తోలి సారిగా నిర్వహించనున్న పార్లమెంట్ సమావేశాలు

కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి NDA ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నాయి.తోలి రెండు రోజులలో ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్, కొత్త ఎంపీ...

Read More..

అన్న అటు.. తమ్ముడు ఇటు ! ఇదో కొత్త ప్లానా బ్రదర్

రాజకీయ నాయకుల తెలివితేటలు సామాన్యులు ఎవరికీ అర్ధం కావు.వారు ఏమి చేసినా దానికి ఒక ప్రణాళిక, వ్యూహం ఉంటుంది.రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుకి ఏ మాత్రం ఢోకా లేకుండా చూసుకుంటారు.ఇవన్నీ షరా మామూలే అయిపోయాయి.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను చూసుకుంటే కాంగ్రెస్...

Read More..

టిడిపి నీడ నుంచి బయటపడడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళిక

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ ప్రణాళికలతో భవిష్యత్ కార్యాచరణ సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి బాధ నుంచి బయటపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఓటమికి కారణాలను ఇప్పటికే విశ్లేషించినట్లు సమాచారం.జిల్లాల...

Read More..

జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది.వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ ఓటమి పై సుదీర్ఘంగా చర్చింస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సంధి అవస్థలో ఉంది.ప్రస్తుతం...

Read More..

జగన్ పరిపాలనపై నోరు జారిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి

రాజకీయాలలో నాయకులు ఎవరైనా మాట్లాడితే కాస్త చూసుకొని మాట్లాడాలి.మాట్లాడేటప్పుడు ఏమైనా తేడా వస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం మాట్లాడుతారు.గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తడబడుతూ చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.చంద్రబాబు సైతం...

Read More..

జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

ఏపీ సి ఎం గా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత నిదానంగా ఒక్కొక్క అంశంపై దృష్టి పెడుతూ ఒక్కొక్కటిగా పావులు కదుపుతున్నారు.ఇప్పటికే ఏపీ మాజీ సి ఎం చంద్రబాబు కు కల్పించిన భద్రతను తగ్గించిన సంగతి తెలిసిందే.చంద్రబాబుకు...

Read More..

రేవంత్ కు కీలక పదవి దక్కబోతోందా ?

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా అయిపొయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది.అయినా ఫలితం కనిపించలేదు.ఆ తరువాత అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ ఎమ్యెల్యేలను...

Read More..

కమలం గూటికి మాజీ జేడీ ? జనసేనకు ఝలక్ తప్పదా ?

సమర్ధవంతమైన పోలీస్ అధికారిగా, నిజాయితీపరుడిగా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి నుంచి జగన్ కేసుల వరకు లక్ష్మి నారాయణ సీబీఐ అధికారిగా తనదైన స్టయిల్లో పనిచేసుకుంటూ ముందుకు వెళ్లారు.ఆ తరువాత...

Read More..

నీతి అయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదాపై గళం విప్పిన జగన్

ఏపీముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి కేంద్రంలో నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కీలకంగా ప్రస్తావించారు.ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి గుర్తు చేసారు.విభజన సమయంలో ఏపీకి తీవ్ర...

Read More..

బిజెపిలో చేరడం పై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి! త్వరలో అధికారికంగా కన్ఫర్మ్

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయింది.ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా రాకపోయినా ఓ మోస్తారు సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం, ఆ పార్టీని ముందుండి నడిపించే సరైన లీడర్స్ లేక ఎవరికి...

Read More..

పవన్ కళ్యాణ్ ఓటమి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్నారు.తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడమే కాకుండా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క స్థానానికి మాత్రమే జనసేన పార్టీ పరిమితం కావడం ఏపీ రాజకీయాల్లో...

Read More..

నీతి ఆయోగ్ కు ఆ ముగ్గురు సీ ఎం లు దూరం

ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించింది.ఈ క్రమంలో నరేంద్ర మోడ్ రెండోసారి ప్రధాని గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.అయితే ఆయన రెండో సారి ప్రధాని...

Read More..

ప్రతిపక్ష నేతపై దాడి చేస్తే పర్లేదు కానీ..తనిఖీ చేస్తే అవమానమా

ఏపీ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ,టీడీపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.అయితే ఇప్పుడు చోటుచేసుకున్న తాజా ఉదంతం తో మరోసారి నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.గన్నవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న సమయంలో గన్నవరం...

Read More..

మొత్తానికి టీడీపీ నుంచి వైసీపీలోకి జంపింగ్ లు తప్పవన్నమాట

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మిగతా పార్టీలకు చెందిన నాయకులు క్యూ కడుతుంటారు.ఆయా పార్టీలు కూడా ఇలా వలస వచ్చే వారికి పెద్ద పీత వేస్తూ...

Read More..

టి. కాంగ్రెస్ లో 'జగన్ రాజకీయం' ఏంటి

ఏపీ అధికార పార్టీ వైసీపీ, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య స్నేహం కొనసాగుతోంది.ఒకరికి ఒకరు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుకుంటూనే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆలోచనలో ఉన్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా కొత్తగా ఏపీలో సీఎంగా...

Read More..

తొలిసారి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న జగన్...ప్రత్యేక హోదా సంగతేంటో

ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగున్న నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొననున్నారు.ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి ఏపీ సీ ఎం జగన్ తో పాటు...

Read More..

ఓటమి పై హైకోర్టును ఆశ్రయించిన బోండా ఉమా

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనపై 25 ఓట్ల మెజారిటీ తో వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందడం పై ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.తమ...

Read More..

బాబు కు ఘోర అవమానం..గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బాబు చెక్ చేసి పంపిన సిబ్బంది

పదవి లో ఉన్నంత వరకే ఎవరికైనా పవర్ అన్న విషయం తాజా ఘటన తో తేటతెల్లమైంది.ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తో తెగ సతమతమౌతున్న ఏపీ మాజీ సీ ఎం నారా చంద్రబాబు నాయుడు కు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో...

Read More..

టీడీపీ పార్టీ ఓటమికి వంద కారణాలు అంటున్న పార్టీ నేతలు

తాజాగా జరిగిన ఎన్నికల్లో గత అధికార పార్టీ టిడిపి సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక విధానాలతో పాటు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేయడం, అలాగే పరిశ్రమలకు ఐటీ కంపెనీలకు ఏపీని కేంద్ర బిందువుగా మార్చాలని ప్రయత్నం చేయడంలో చంద్రబాబు...

Read More..

జనసేనకి కీలకంగా మారనున్న టిడిపి భవిష్యత్తు

ఏపీ రాజకీయాల్లో తాజా ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది.ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇక మూడో ప్రత్యామ్నాయంగా వచ్చి ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అనుకున్న జనసేన పార్టీ ఊహించని విధంగా...

Read More..

మరో సమస్య...బాబుకు వ్యతిరేకంగా హైకోర్టు లో పిటీషన్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు అధికారం దూరమవ్వడం తో ఒకదాని తరువాత మరొకటి సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి.ఒకపక్క అసెంబ్లీ లో అధికార పార్టీ ని ఎదుర్కోవడానికి నానా తిప్పలు పడుతుంటే ఇప్పుడు ఆయన కు...

Read More..

చంద్రబాబు చూపంతా ఇప్పుడు ఆయనపైనేనట!

ఏపీ మాజీ సి ఎం చంద్రబాబు నాయుడు చూపంతా కూడా ఇప్పుడు ఆయన పైనేనట.ఇంతకీ ఆయన ఎవరు అని అనుకుంటున్నారా.ఆయనే ఒకప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ కు అధికారాన్ని అందించి,ఇప్పుడు ఏపీ లో వైసీపీ పార్టీ కి విజయాన్ని అందించిన...

Read More..

మన్మోహన్ ఇక రాజకీయాలకు దూరం కానున్నారా!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక రాజకీయాలకు దూరం అవ్వనున్నారు అన్న చర్చ విపరీతంగా జరుగుతుంది.దీనికి కారణం నిన్నటి తో ఆయన రాజ్యసభ సభ్యత్వం పూర్తి అవ్వడమే.ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఆయన పదవి కాలం జూన్ 13 వ తేదీ...

Read More..

రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొని అక్షరాలు దిద్దించిన సీఎం

ఏపీ లోని తాడేపల్లి మండలం పెనుమాక లో ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.పెనుమాక లోని వందేమాతరం హైస్కూల్ లో విద్యార్థులకు జరిగే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని పలకా...

Read More..

కిషన్ రెడ్డి ని చంపేస్తామంటూ బెదిరింపులు...సైబర్ పోలీసులకు ఫిర్యాదు

కేంద్ర హోం సహాయక మంత్రిగా కిషన్ రెడ్డి ఇటీవల భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది.దీనితో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.గత నెల 20న ఇంటర్‌నెట్‌ వాయిస్‌కాల్స్‌ ద్వారా కొందరు...

Read More..

స్పీడ్ పెంచుతున్న కమలం ! రేవంత్ 'హ్యాండ్' ఇచ్చేస్తాడా ?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు బలం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బలపడాలనే ఆలోచనలో ఉంది.అందుకే పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టింది.దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బాగా బలపడి ఆ రాష్ట్రంలో కూడా పార్టీని అధికారంలోకి...

Read More..

వైసీపీ మంత్రులను భయపెడుతున్న మాజీ మంత్రి లోకేష్

అదేంటి అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులను మాజీ మంత్రి,టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ భయపెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా, విషయం ఉందండీ.అదేంటంటే ఏపీ సచివాలయంలో మంత్రులకు చాంబర్స్ ని కేటాయించారు.ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మందికి సచివాయలం...

Read More..

వారి అలకను జగన్ ఇలా తీరుస్తున్నాడా

వారంతా పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు.మొదటి నుంచి పార్టీ అధినేత వెన్నంటే ఉన్నారు.అధికార పార్టీ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయినా ఎప్పుడూ అధినేత మాట జవదాటలేదు.దాదాపు తొమ్మిదేళ్ల పాటు అధికార పార్టీలతో పోరాడాడుతూనే ప్రజల మద్దతు భారీగా కూడగట్టారు.ఇంకేముంది పార్టీ...

Read More..

వైసీపీతో టచ్ లో ఉంది ఎవరబ్బా ? నిఘా పెట్టిన బాబు ?

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపొయింది ఏపీలో టీడీపీ పని.ఇప్పటికే అతి తక్కువ స్థానాల్లో గెలుపొందేమే అన్న బాధ ఆ పార్టీ అధినేత చంద్రబాబు లో ఎక్కువ కనిపిస్తోంది.తనతో పాటు గెలిచిన 22 మందితో ఈ ఐదేళ్లు ఏదోలా నెట్టుకొద్దామంటే...

Read More..

ఆ ఒక్క విషయంలో తండ్రిని ఫాలో అవ్వని జగన్!

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ జగన్ ఆశయాల సాధనే లక్ష్యంగా పరిపాలన సాగిస్తా అని చెప్పుకొచ్చారు.అందుకు తగ్గట్లుగా సామాన్యుడుకి పట్టం కట్టే విధంగా పథకాల రూపకల్పన చేసి, ప్రతి ఇంట్లో...

Read More..

రైతులకి అది జరగదని తేల్చేసిన వైసీపీ! ఇక ఆశలు వదులుకోవాల్సిందే

తాజా ఎన్నికలలో వైసీపీ భారీ ఆధిక్యం సొంతం చేసుకొని ఏపీలో అధికారంలోకి వచ్చింది.ఎవరు ఊహించని విధంగా అంచనాలు తారుమారు చేస్తూ అద్బుతమైన విజయాన్ని అందుకున్న వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత నుంచి తన నవరత్నాలు అమలు చేయడం...

Read More..

ప్రారంభమైన రెండో రోజు సభ...ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ గా వైసీపీ నేత తమ్మినేని సీతారాం ను సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని కి మంత్రిగా కూడా మంచి అనుభవం ఉంది.తొలుత టీడీపీ పార్టీ నుంచి...

Read More..

టార్గెట్ బాబు : ఈ విషయంలో ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాట !

టీడీపీ అధినేత చంద్రబాబు కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది.ఏపీలో అధికారం కోల్పోవడమే కాకుండా తనకు రాజకీయ బద్ద విరోధులుగా ఉన్నవారంతా ఇప్పడు అధికారంలో ఉండడం, వారంతా తననే టార్గెట్ చేసుకుని అన్ని వ్యవహారాల మీద ఏంక్వైరీలు చేయించడం బాబు కి...

Read More..

ఈ విషయంలో జగన్ కు ముందు నుయ్యి వెనుక గోయ్యేనా ?

ఒక్కోసారి కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం కష్టం అవుతుంది.మరికొన్నింటికి పరిష్కారం దొరికినా క్లారిటీ లేకుండా ఇబ్బంది పెట్టేస్తుంటుంది.ఇప్పుడు అదే పరిస్థితి కొత్త ముఖ్యమంత్రి జగన్ విషయంలోనూ ఎదురయ్యి ఇరుకునే పెట్టేలా కనిపిస్తోంది.ఎన్నో తలకు మించిన హామీలు ఇచ్చి ప్రజల అభిమానాన్ని...

Read More..

వెస్ట్ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన, మమత సర్కార్ కు ఫుల్ స్టాప్ పడనుందా

వెస్ట్ బెంగాల్ లో ఇక మమత సర్కార్ లేనట్టేనా.రాష్ట్రపతి పాలన విధించనున్నారా అని ప్రశ్నిస్తే నిజమే అన్నట్లు వార్తలు వస్తున్నాయి.అక్కడ హింస రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా ఆర్టికల్ 356ని ప్రయోగించే పరిస్థితి వస్తుందని దీనితో అక్కడ రాష్ట్రపతి పాలన తప్పదంటూ...

Read More..

వీళ్ల 'స్టార్' జగన్ మారుస్తాడా ?

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో సినిమా స్టార్ ల సందడి ఎక్కువగా ఉండేది.టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం అయినా, ఎన్నికల ప్రచారం అయినా పెద్ద సంఖ్యలో సినిమా ఫీల్డ్ కి సంబందించినవారు వాలిపోతుండేవారు.టీడీపీని స్థాపించిందే సినిమా రంగంలో ఎవర్ గ్రీన్ గా నిలిచినా...

Read More..

రోజాకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తన పంథా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.ఇక క్యాబినెట్ ఏర్పాట్లు కూడా సామాజిక వర్గాల...

Read More..

రావెల కిషోర్ బాబు పార్టీ వీడటంపై జనసేన కార్యకర్తల అభిప్రాయం ఎలా ఉందంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసి తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అతని రాజకీయ భవిష్యత్తుకి పునాదులు వేసింది.అయితే తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ...

Read More..

కార్పొరేట్ విద్యాసంస్థల కి మొదటి దెబ్బ కొట్టిన జగన్

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో లో విద్యా వ్యవస్థను పూర్తిగా కార్పొరేట్ విద్యాసంస్థలు కబ్జా చేసేసాయి అని చెప్పాలి.రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా ప్రమాణాలను పూర్తిగా తుంగలో తొక్కేసి మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థుల మీద...

Read More..

జగన్ ను కలిసిన ఆ ఒక్క ఎమ్మెల్యే కారణం!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు.ఈ క్రమంలో తొలుత ప్రొటెం స్పీకర్ ఏపీ మంత్రుల చేత,ఎమ్మెల్యేల చేత మరోసారి ప్రమాణ స్వీకారం...

Read More..

వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా...అయితే ఇక జైలుకే!

ఇటీవల భార్య,భర్తలు ఇద్దరూ ఉద్యోగాలో మరేదైనా కారణమో కావొచ్చు వృద్ధ తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.ఒకప్పుడు చిన్న పిల్లల సంరక్షణ కోసం మాత్రమే కనిపించే ఆశ్రమాలు, ఇప్పుడు వృద్ధుల సంరక్షణ కోసం కూడా ఎక్కడ పడితే అక్కడ వెలిసిపోయాయి.దీనితో సమయం లేని...

Read More..

మరోసారి పేస్ బుక్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన నాని

గత కొద్దీ రోజులుగా టీడీపీ పై అసంతృప్తి తో ఉన్న నేత కేశినేని నాని మరోసారి పేస్ బుక్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల శ్రీ శ్రీ వ్యాఖ్యలు పోస్ట్ చేసి వార్తలలో నిలిచిన నాని ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన...

Read More..

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు...తొలిసారి ప్రతిపక్షనేతగా బాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో తొలిసారిగా అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా మాజీ సి ఎం చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 సీట్ల లో భారీ మెజారిటీ తో గెలుపొంది నవాంధ్ర...

Read More..

ఆ హామీల అమలు ఎలా ? కేసీఆర్ కి నిద్రపట్టడంలేదే ?

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు చూస్తే అసలు ఇవి అమలు సాధ్యమేనా ? ఆ హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకు వస్తారు ? అసలు ఏ ధైర్యంతో ఇటువంటి హామీలు ఇస్తున్నారు అనే సందేహం సామాన్యుల్లో కూడా...

Read More..

వైసీపీని ఎదుర్కొనేదెలా ? టీడీపీ కి క్లారిటీ రాలేదా ?

ఓడలు బళ్ళు .బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కి బాగా తెలిసొచ్చినట్టు ఉంది.ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది కేవలం 23 స్థానాలకే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అదీ కాకుండా మొన్నటివరకు తాను ఏలిన సింహాసనంపై...

Read More..

విజవాడ వచ్చిన రోజా...మంత్రి పదవి దక్కకపోవడం పై సానుకూలంగా స్పందించారు

చిన్న తేడా వస్తే తన మాటలతో విరుచుకుపడే వైసీపీ ఎమ్మెల్యే రోజా తనకు మంత్రి పదవి రాకపోవడం పై సానుకూలంగా స్పందించారు.ఇటీవల ఏపీ క్యాబినెట్ కూర్పు జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ కూర్పు లో వైసీపీ ఎమ్మెల్యే రోజా కు తప్పకుండా...

Read More..

సీ ఎం పీఠాన్ని తలా రెండున్నరేళ్లు పంచుకోనున్న ఆ రెండు పార్టీలు

ఇటీవల ఏపీ క్యాబినెట్ మంత్రుల పదవులు రెండున్నరేళ్లే ఉంటాయని, మరో రెండున్నరేళ్లు వేరేవారికి అవకాశం ఇస్తామని సి ఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ విధానం కొత్తగా ఉందని,అందరినీ తృప్తి పరచడం లో జగన్ అడుగులు వేస్తున్నారని అనుకున్నారు...

Read More..

కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చిన రాములమ్మ! జగన్ చూసి నేర్చుకోవాలని సలహా

కాంగ్రెస్ పార్టీ మహిళా నేతగా తెలంగాణ రాజకీయాలలో తన ఉనికి చాటుకుంటున్న రాములమ్మ గతంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలబడింది.అయితే రాములమ్మ తెలంగాణలో కీలక నేతగా ఎదగడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్న ఇప్పటి వరకు విజయం అందుకోలేకపోయింది.దీనికి...

Read More..

కాంగ్రెస్ పార్టీని నడపలేనని చేతులెత్తేసిన రాహుల్ గాంధీ! అధ్యక్ష బాద్యతలు మరో సీనియర్ నేతకి

దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రస్తానం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తన ప్రస్తానం కొనసాగిస్తూ వస్తుంది.ఇక కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రు కుటుంబం కనిపిస్తుంది.ఆ కుటుంబ వారసులె పార్టీని నడిపిస్తూ వస్తున్నారు.ఇక ఆ కుటుంబం నుంచే ఎక్కువగా...

Read More..

టీడీపీలో కీలక మార్పులు ? ఆ భయం వెంటాడుతోందా ?

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉండడం, సామజిక సమీకరణాల లెక్కల్లో జగన్ తెలివిగా వ్యవహరించడం అన్ని విధాలా ఆ పార్టీకి బాగా కలిసి రావడంతో తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం మొదలయ్యింది.ఎవరూ వేలెత్తి చూపని విధంగా కీలక పదవులను బడుగు...

Read More..

టీఆర్ఎస్ లో కాంగ్రెస్ శాసన సభా పక్షం విలీనం పై హైకోర్టు లో విచారణ

ఇటీవల తెలంగాణా లో టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని విలీనం చేసిన సంగతి తెలిసిందే.ఆ రాష్ట్రంలో ఉన్న 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం తో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని విలీనం...

Read More..

పవన్ 'పవర్' పాలిటిక్స్ ఇలా ఉండబోతున్నాయా ?

ఎన్నికల ముందు ఉండాల్సిన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఎన్నికలు అయిపోయిన తరువాత ఆలోచిస్తోంది జనసేన పార్టీ.పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా ఓటమి చెందిందో అర్ధంకాని విషయంగా మారిపోయింది.సినిమా అభిమానం వేరు, రాజకీయ అభిమానం వేరు అనే విషయం కూడా పవన్ కు...

Read More..

అప్పుడే కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేస్తున్న జగన్ ?

ఏపీలో జగన్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్న వారిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకరు.వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించారు.ఒకరకంగా చెప్పాలంటే జగన్ వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంత కష్టపడ్డాడో అంతే కష్టం తెర వెనుక కేసీఆర్...

Read More..

పార్టీ మారారో లేదో అప్పుడే మొదలెట్టేశారు

రాజకీయ నేత అంటేనే పది నాలుకలు ఉండేవాడు అని అర్ధం.ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటే ఆ పార్టీ కి అనుకూలంగా మాట్లాడడం రాజకీయ నేత నైజం.సరిగ్గా ఇదే పద్దతి పాటిస్తున్నారు మాజీ జనసేన నేత రావెల కిషోర్ బాబు.ఇటీవల...

Read More..

పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ కోటరీలో బంధించేసిన ఆ నలుగురు

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ని మించిపోయింది.పవన్ కళ్యాణ్ ఐడియాలజీ,...

Read More..

మంత్రులకు నేరుగా వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్

ఏపీలో తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా తనదైన పంథాలో దూసుకుపోతున్నారు.తను హామీ ఇచ్చిన నవరత్నాలను వరుసగా అమలు చేసుకుంటూ, మరోవైపు ఇచ్చిన హామీల మేరకు వాటిని కూడా రాజ్యాంగ...

Read More..

తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ రానుందా

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తన వ్యూహాలని అమలు చేయడం మొదలు పెట్టిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.సౌత్ ఇండియాలో ఒక్క కర్ణాటక తప్ప ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి ప్రజల మద్దతు లేదు.నార్త్ ఇండియాలో బలం నిరూపించుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చిన...

Read More..

ఏపీలో కాంగ్రెస్ ని బ్రతికించే బాద్యత బాబుకి అప్పగించిన రాహుల్

ఏపీలో 40 ఏళ్ళ రాజకీయ ప్రస్తానంలో తెలుగు దేశం పార్టీ అధినేతగా ఆ పార్టీని ముందుండి నడిపించడమే కాకుండా హైదరాబాద్ మహానగరంపై ప్రపంచ ద్రుష్టి పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన నేత చంద్రబాబు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రెండు సార్లు, నవ్యాంధ్ర...

Read More..

తన స్వార్ధం కోసమే పార్టీ మారినట్లు ఒప్పుకున్న రావెల కిషోర్ బాబు

ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీ స్థాపించి తమ ఇమేజ్ తో రాజకీయాలలో ప్రభావం చూపించాలని ప్రయత్నం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తాజా ఎన్నికలలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.ఎన్నికలలో కేవలం ఒక్క స్థానంకి జనసేన పరిమితం అయిపొయింది.ఇదిలా ఉంటే...

Read More..

'షా' తో గవర్నర్ నరసింహన్ భేటీ.... కారణం అదేనా

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తరువాత ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారి తీసుతున్న అంశం.తెలుగు రాష్ట్రాల గవర్నర్ మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే వీటిపై స్పష్టమైన సమాచారం లేదు కానీ ఈ వార్తలకు తోడు ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్...

Read More..

'మోరే' లో ఎమ్మెల్యేల నిర్వాకం, స్థానిక యువతులతో అసభ్యకర నృత్యాలు

అధికారం చేతిలో ఉంటె ఏదైనా చెయ్యొచ్చు అన్న ధీమా నేతలలో పెరిగిపోయింది.ఇటీవల నేతల ఆగడాలకు సంబంధించి ఎన్ని వీడియో లు బయటకొస్తున్నా కూడా ఎవరూ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు ఉంటున్నారు.తాజాగా బీహార్ ఎమ్మెల్యే ల సెల్ఫీ డాన్సులకు...

Read More..

స్థానికేతరులు రాజకీయాలు చేయనవసరం లేదంటూ కమల్,రజనీ లపై మండిపడ్డ నటుడు

సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్న విషయం తెలిసిందే.సినీ జీవితం పరంగా ఎందరినో అభిమానిస్తూ ఉంటారు.కానీ రాజకీయాలలోకి వచ్చే సరికి తమ అభిమాన నటుడు అయినా కానీ ప్రజలు ఒక పట్టాన ఒప్పుకోలేరు.తమిళ చిత్ర పరిశ్రమలో తలైవా గా పేరున్న రజనీ...

Read More..

కోడెల కు మరో దెబ్బ కొడుకే కాదు కూతురిపై కూడా కేసు నమోదు

ఏపీ మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ పై మరో దెబ్బ పడింది.ఇప్పటికే కొడుకు శివ రామకృష్ణ పై చీటింగ్ కేసు నమోదు కాగా,త్వరలో అరెస్ట్ కు కూడా అంతా సిద్ధం అని వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.అయితే...

Read More..

జనసేనను దెబ్బకొట్టింది అదేనా ? అయినా మార్పులేదా ?

రాజకీయాల్లో కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన.ఈ చిన్న క్లారిటీ తెలుసుకోలేకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను దెబ్బతినడంతో పాటు పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు కూడా దెబ్బతినడానికి కారణం అయ్యారు.ఎన్నికల ఫలితాలు జనసేనను తీవ్ర నిరాశ కలిగించాయి.స్వయంగా పవన్...

Read More..

జగన్ ఆ మరకలు చెరిపెయ్యాలనుకుంటున్నాడా ?

వైసీపీ అధినేత జగన్ పై అనేక నిందలు ఉన్నాయి.జగన్ లక్షకోట్ల దొంగ, జైలుపక్షి, అవినీతిపరుడు అని అయన మీద రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.జనాల్లోకి కూడా లక్ష కోట్లు అనే అంశం బాగా వెళ్ళిపోయింది.ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి...

Read More..

స్పెషల్ స్టేటస్ పై జగన్ స్పెషల్ రిక్వెస్ట్ చేయలేదా ?

ఏపీకి ప్రత్యేక హోదా ! ఇదే అంశంపై రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి వైసీపీ అధినేత జగన్ సీరియస్ గానే పోరాటం చేసాడు.ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ అనేక దీక్షలు పార్టీ తరపున చేపట్టారు.ఢిల్లీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసుకుని మరీ...

Read More..

వైఎస్ జగన్ అభ్యర్ధనని ప్రధాని వినే పరిస్థితి ఉందా! అదే జరిగితే జగన వ్యూహం ఏంటి

లోక్ సభలో భారీ విజయాన్ని సొంతం చేసుకొని మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడంతో మోడీ ప్రధానిగా రెండో సారి బాద్యతలు తీసుకున్నారు.ఇక ప్రధానిగా బాద్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ మోడీ తిరుపతికి వచ్చారు.ఇక తిరుపతి పర్యటనలో ఏపీ సిఏం జగన్ మోడీని...

Read More..

ఆ వార్తల్లో నిజం లేదని చెప్పిన జనసేన కీలక నేత! పవన్ కళ్యాణ్ తోనే ఉంటా అని ప్రకటన

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసిన జనసేన అధినేత జగన్ ఊహించని విధంగా తాజా ఎన్నికలలో ఓటమి పాలయ్యాడు.కేవలం ఒక్క సీటుకి పరిమితం అయిపోయి ఊహించని దెబ్బ తిన్నాడు.దీంతో ఇప్పుడు జనసేన పార్టీ లో పవన్...

Read More..

పవన్ కోసం అక్కడ 150 కోట్లు ఖర్చు చేశారా ?

జనసేన పార్టీలో ఓటమి బాధ ఎక్కువగా కనిపిస్తోంది.ఎంతో చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేవలం ఒక్కటంటే ఒక్క సీటు దక్కడం ఇప్పటికీ అధినేత పవన్ తో పార్టీ పార్టీ నేతలు ఎవరికీ మింగుడుపడడంలేదు.అందుకే అసలు మనం ఎందుకు...

Read More..