ఇటీవల ఏపీ క్యాబినెట్ మంత్రుల పదవులు రెండున్నరేళ్లే ఉంటాయని, మరో రెండున్నరేళ్లు వేరేవారికి అవకాశం ఇస్తామని సి ఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ విధానం కొత్తగా ఉందని,అందరినీ తృప్తి పరచడం లో జగన్ అడుగులు వేస్తున్నారని అనుకున్నారు అందరూ.
అయితే ఇప్పుడు మహారాష్ట్ర లో ఏకంగా సీ ఎం పదవిని రెండు పార్టీలు పంచుకోనున్నాయి.అవే శివసేన,బీజేపీ.
సార్వత్రిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయగా మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేయాలని నిర్ణయించాయి.
అయితే ఈ ఎన్నికల్లో గెలిస్తే ఇరు పార్టీలు తలా రెండున్నరేళ్లు సీ ఎం పదవిని పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

లోక్ సభ ఎన్నికలకు ముందే ఇరు పార్టీలు ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చినట్లు శివసేన యువనేత వరుణ్ సర్ దేశాయ్ వెల్లడించారు.అయితే ఈ అంశంపై ఇప్పటివరకు బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ల మధ్య జరిగిన భేటీ లో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తుంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అక్టోబర్ మాసంలో జరగనున్నాయి.
అలాంటి ఈ సమయంలో శివసేన యూత్ నేత చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.







