ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ పై గుడ్ న్యూస్ వినిపిస్తుంది.ఒక గుడ్ న్యూస్ మరవక ముందే మరో గుడ్ న్యూస్ వినిపించింది ప్రభుత్వం.
ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు.
ఇంధనం అధికంగా వాడకు.పర్యావరణం పరిరక్షించు’ అన్న నినాదంతో నిర్వహించిన బెస్ట్ కేఎంపీఎల్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సునీల్శర్మ 11 మంది డ్రైవర్లను అవార్డులతో సత్కరించి మాట్లాడారు.
సునీల్ శర్మ మాట్లాడుతూ.ఉద్యోగుల బదిలీ, ఓడీ, ఇతరత్రా విషయాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
అయితే ప్రస్తుతం సంస్ద ప్రతి నెలా 80 నుండి 90 కోట్ల రూపాయిల ఆదాయాన్ని ఆర్జిస్తోందని.ఇదంతా సమిష్టి కృషితోనే సాధ్యం అయ్యింది అని ఇలాగె మరి కొన్ని నెలలు కృషి చేస్తే డిసెంబర్ ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సునీల్ శర్మ చెప్పుకొచ్చారు.కార్గో సర్వీసులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
అంతేకాదు.
పీఎఫ్ బకాయిలను కూడా తొందర్లోనే చెల్లించనున్నట్టు సునీల్ శర్మ స్పష్టం చేశారు.ఏది ఏమైనా ఆర్టీసీ ఉద్యోగులకు మంచి గుడ్ న్యూస్ అందింది అనే చెప్పాలి.