Tamilisai Soundararajan : మేడారానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి అర్జున్ ముండా..!

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర( Medaram Maha Jathara )కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) వెళ్లారు.ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి అర్జున్ ముండాకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు స్వాగతం పలికారు.

తరువాత సమ్మక్క - సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై మొక్కులు చెల్లించారు.కాగా గవర్నర్ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి.ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

ఈ క్రమంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.అలాగే ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మేడారానికి వెళ్లి అమ్మవార్లను దర్శించుకోనున్నారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు