తెలంగాణ ప్రజలకు ఊహించని వార్త.కరోనా తీవ్ర విజృంభన నేపధ్యం లో రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ పది రోజుల తర్వాత పరిస్దితి ఎంటనే ప్రశ్న చాలా మంది మనస్సులో పుట్టి ఉంటుంది.ఇప్పటికే ఈ లాక్డౌన్ ఈనెల చివరి వరకు ఉంటుందని జోస్యాలు కూడా చెప్పారు.
మరి కొందరు మాత్రం తెలంగాణలో కరోనా తగ్గు ముఖం పడుతుంది కాబట్టి కఠిన ఆంక్షలు అమలు చేస్తారు కానీ లాక్డౌన్ విధించరని ఊహించుకున్నారు.
కానీ తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ పొడిగించడమే మేలని రాష్ట్ర క్యాబినెట్ అభిప్రాయపడిందట.
దీంతో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఇకపోతే ఎప్పటి లాగానే ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రం ప్రజలు తమ అవసరాల నిమిత్తం బయటకు రావచ్చని, ఆ తర్వాత అనవసరంగా రోడ్ల మీద కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు.