సినిమా కోసం ఎన్ని పాట్లు పడతారో మన హీరో హీరోయిన్లు.ఎంతసేపు సంపాదిస్తున్నారుగా అని అలోచిస్తామే తప్ప, వాళ్ళు పడే కష్టం మామూలు కష్టం.
కాస్త సన్నబడ్డా, కాస్త లావెక్కినా, బయట జనలాతో పాటు, న్యూస్ పేపర్లలో, వెబ్ సైట్స్ లో కథనాలు రాసేవారికి చిక్కిపోతారు.అచ్చ తెలుగమ్మాయి స్వాతి ది కుడా అలాంటి పరిస్థితే.
చూడడానికి ఇంకా చిన్నపిల్లలానే ఉంటుంది స్వాతి.అందుకేనేమో తనకి ఎప్పుడు చలాకీగా ఉండే పాత్రలే తప్ప, గ్లామరస్ పాత్రలు రాలేదు.
కొత్తగా తీసిన త్రిపురలో ఓ సాధారణ గృహిణి పాత్ర తనది.గృహిణి అంటే గృహిణిలానే కనిపించాలిగా.
అందుకే పాత్ర కోసం బరువు పెరిగింది స్వాతి.
అపుడెప్పుడో వచ్చిన ‘ గోల్కొండ హై స్కూల్’ సినిమాలో స్వాతి చీర కడితే మరీ చిన్న పిల్లలా ఉన్నావు అంటూ చాలా మంది కామెంట్ చేసారట.
ఇక త్రిపురలో అధికభాగం చిరల్లోనే కనిపించాలి.మళ్ళి కామెంట్స్ కి చాన్స్ ఇచ్చి బాధపడటం ఎందుకు ఆనుకున స్వాతి ఆరు కిలోల బరువు పెరిగింది.
స్వాతి – నవీన్ చంద్ర జంటగా నటించిన త్రిపుర రేపు విడుదల కానుంది.కోన వెంకట్ రచన సహకారం అందించిన ఈ చిత్రానికి రాజకిరణ్ దర్శకుడు.