తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ఫోటోలు వైరల్!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో సందడి చేశారు.గురువారం విఐపి విరామ సమయంలో రజనీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

 Superstar Rajinikanth Visited Tirumala Srivaru Photos Are Viral ,superstar Raji-TeluguStop.com

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్ స్వామి వారి ఆలయానికి వెళ్ళగానే ఆలయ అర్చకులు రజనీకాంత్ కు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు.

స్వామివారి దర్శనం అనంతరం ఈయన ఆలయం వెలుపల సందడి చేశారు.

నేడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రజనీకాంత్ కడపకు బయలుదేరారు.

ప్రస్తుతం కడపలో జరుగుతున్నటువంటి ఆమీన్ పీర్ దర్గా గంధం ఉత్సవాలలో భాగంగా ఇప్పటికే పలువురు అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే నేడు రజనీకాంత్‌  కూడా కడప అమీన్ పీర్ దర్గా దర్శించుకోనున్నట్టు సమాచారం.

ఇక తిరుమల స్వామివారి దర్శనం నిమిత్తం బుధవారం సాయంత్రమే రజనీకాంత్ తిరుమల చేరుకున్నట్టు సమాచారం.

బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్న రజినీకాంత్ కి టీఎస్‌ఆర్‌ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ రిసెప్షన్‌ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఓఎస్డీ రామకృష్ణ స్వాగతం పలికారు.ఇక గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube