రాజన్న సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో సిరిసిల్లకు వందసార్లు వచ్చానని చెప్పారు.
అప్పర్ మానేరు రూపురేఖలు మార్చామన్న కేసీఆర్ ఎండాకాలంలోనూ అప్పర్ మానేరు ఉరకలేస్తోందని తెలిపారు.సిరిసిల్ల నియోజకవర్గానికి కేటీఆర్ ఎమ్మెల్యే కావడం ప్రజల అదృష్టమన్నారు.
ఈ క్రమంలోనే చేనేతల బతుకులు మార్చిన కేటీఆర్ కు అభినందనలు తెలిపారు.కేటీఆర్ కృషితోనే చేనేతల బలవన్మరణాలు ఆగాయన్న కేసీఆర్ చేనేత కార్మికుల అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
భవిష్యత్ లో విద్యాకేంద్రంగా సిరిసిల్లను తీర్చిదిద్దుతామని వెల్లడించారు.