తెలంగాణ, ఏపీ మధ్య మొన్నటి వరకు కృష్ణా నీళ్ల పంచాయితీ తారా స్థాయిలో జరిగింది.అయితే దీనిపై వైఎస్ షర్మిల ఎలాంటి కామెంట్లు చేయలేక సతమత మయిందనే చెప్పొచ్చు.
ఆమె కామెంట్లు చేయకపోవడంతో అంతా ఆమె పని అయిపోయిందని ఒక్క దెబ్బతో టీఆర్ ఎస్ అధిష్టానం ఆమె పార్టీ పెట్టకముందే దెబ్బ కొట్టేశారని కామెంట్లు వచ్చాయి.ఇక దీనిపైనా షర్మిల కానీ ఆమె అభిమానులు గానీ ఎలాంటి స్పందన చేయలేదు.
కానీ ఆమె ఈరోజు ఆలోచనాత్మకమైన కామెంట్లు చేశారు.
ఈ రోజు ఆమె తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు.
పనిలో పనిగా తన పార్టీ వైఖరిని కూడా చెప్పారు.తాను కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు రావాల్సిన ఒక్క బొట్టును కూడా వదిలిపెట్టనని, అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాటిని కూడా అడ్డుకోబోనని తెలిపింది.
ఈ మాటలు చూస్తుంటే ఇటు తెలంగాణ సెంటిమెంట్ను దెబ్బ తీయకుండా అటు ఏపీ మనోభావాలను కూడా నొప్పించకుండా చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడారని తెలుస్తోంది.
అలాగే అటు ఏపీలో కూడా తన చరిష్మా తగ్గకుండా అన్న పార్టీకి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చూసుకుందని తెలుస్తోంది.ఇక ఇప్పుడు ఆమె మాటలతో కాంగ్రెస్కు గానీ టీఆర్ ఎస్కు గానీ ఎలాంటి విమర్శలు చేసేందుకు అవకాశం లేకుండా చేసింది.అయితే ఆమె పూర్తిగా తెలంగాణ వైపే మాట్లాడి ఉంటే బాగుండేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆమె తెలంగాణలో బలపడేందుకు ట్రై చేస్తుండటంతో తెలంగాణ వైపు మాట్లాడితేనే బాగుండేదని అంటున్నారు.కానీ షర్మిల మాత్రం ఒకే సమయంలో ఏపీ తెలంగాణలోని వైఎస్ అభిమానులు మెచ్చే విధంగా మాట్లాడి తన మార్కును కనబరిచారు.
ఏదేమైనా షర్మిల కామెంట్లు ఇప్పుడు చర్చనీయాశంగా మారాయి.