ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ( Rakesh master )గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల జూన్ 18వ తేదీన ఆయన అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.
చనిపోయే ముందు వరకు కూడా యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటూ ఎంతో యాక్టివ్ గా ఉన్న రాకేష్ మాస్టర్ ఒక్కసారిగా మృతి చెందారు అన్న వార్త వినగానే అందరూ ఒకేసారిగా షాక్ అయ్యారు.ఆయన మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా రాకేష్ మాస్టర్ 10 రోజుల కార్యక్రమం కూడా ముగిసిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి రాకేష్ మాస్టర్ శిష్యులు శేఖర్ మాస్టర్( Sekhar master ), జానీ మాస్టర్ లు హాజరయ్యారు.అయితే చనిపోయే ముందు వరకు కూడా రాకేష్ మాస్టర్ మద్యానికి బానిస అయ్యాడని మతిస్థిమితం కోల్పోయాడు, పిచ్చివాడు అంటూ అనేక రకాల రూమర్స్ వినిపించాయి.కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన గొప్పతనం ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసొచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రాకేష్ మాస్టర్ చివరిగా మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా(S ocial media )లో వైరల్ గా మారాయి.అయితే ఆ వీడియోలను బట్టి చూస్తే రాకేష్ మాస్టర్ ఆరోగ్యం అప్పటికే పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది.
ఆ వీడియోలలో వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు లని తిడుతూ కొన్ని కామెంట్స్ చేశారు.అయితే రాకేష్ మాస్టర్ మూడవ భార్యగా చలామణి అయిన లక్ష్మి గురించి కూడా పరోక్షంగా ఈ వీడియోలో కామెంట్స్ చేసినట్లు అర్థం అవుతోంది.అది నా భార్యని తిట్టింది, కొడుకుని, నా కూతుర్ని తిట్టింది అని చెప్పుకొని బాధపడ్డారు.ఆమెని కూడా నేను తిట్టాను అని తెలిపారు.నేను ప్రస్తుతం మందులో లేను.నీరసంగా ఉన్నాను అని రాకేష్ మాస్టర్ తన సెల్ఫీ వీడియోలో తెలిపారు.
కాగా రాకేష్ మాస్టర్ తన చివరి వీడియోలో కూడా భార్య, పిల్లలనే తలుచుకున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.చివరి రోజుల్లో కూడా పిల్లల గురించి భార్య గురించి మాట్లాడడం అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది.
అయితే రాకేష్ మాస్టర్ మృతి పట్ల అనేక రకాల రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే.