రాజమౌళి దర్శకత్శంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతుంది.ఆ చిత్రం తర్వాత మహేష్బాబు హీరోగా చిత్రంను తెరకెక్కించబోతున్నట్లుగా ఇప్పటికే జక్కన్న ప్రకటించాడు.
అయితే చాలా కాలంగా రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అంటూ చెబుతూ వస్తున్నాడు.ఆ ప్రాజెక్ట్ను తాను ఖచ్చితంగా చేస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.
బాహుబలి సమయంలో ఆ సినిమా గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి.
మహాభారతం ప్రాజెక్ట్ గురించి గత కొంత కాలంగా వార్తలు లేవు.
మళ్లీ ఇప్పుడు జక్కన్న ఆ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేకపోవడంతో ఖాళీ సమయం దొరికింది.
ఈ ఖాళీ సమయంను ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫాలోఅప్ చేయిస్తూ అదే సమయంలో మహాభారతం స్క్రిప్ట్ గురించి కూడా ఆలోచిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
మహాభారతం సినిమా తన సినీ కెరీర్లో చివరిది అయ్యి ఉంటుందని గతంలో ప్రకటించాడు.ప్రస్తుతం సినిమాలు వరుసగా చేసి మరో నాలుగు అయిదు సంవత్సరాల తర్వాత జక్కన్న మహాభారతంను చేస్తాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.అయినా కూడా ఇప్పటి నుండే సినిమాకు సంబంధించిన స్టోరీ విషయంలో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది.
జక్కన్న మహాభారతంను కనీసం అయిదు సంవత్సరాల పాటు రెండు లేదా మూడు పార్ట్లుగా తీస్తాడనే టాక్ కూడా ఉంది.