కరీంనగర్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ ఎలుగుబంటి విజయవంతమైంది.ఈ క్రమంలో జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అటవీశాఖ అధికారులు శ్రీపురంలో ఎలుగుబంటిని మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు.
కాగా జిల్లాలోని శ్రీపురం కాలనీతో పాటు రేకుర్తిలో ఎలుగుబంట్లు సంచరించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే.అనంతరం సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు బల్లూకం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా ఎలుగుబంటి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన సంగతి తెలిసిందే.