కృష్ణా జిల్లా( Krishna District )లోని నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu naidu )పర్యటించారు.ఇందులో భాగంగా దివంగత నేత ఎన్టీఆర్, ఆయన సతీమణి బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాముడు అంటే గుర్తుకు వచ్చేది ఎన్టీఆరేనని తెలిపారు. రాజకీయాల్లో దశ, దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.అతి తక్కువ కాలం పాలన కొనసాగించినా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.అలాగే పన్నులు పెంచితే పేదలు మరింత పేదరికంలోకి వెళ్తారని చెప్పారు.సంపదను సృష్టించడమే ధ్యేయమని స్పష్టం చేశారు.