ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయింది.ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తూ ఉంది.
జనవరి 27 లేదా 28న తారీఖు నాడు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుతో మొత్తం రాష్ట్రంలో 26 జిల్లాలు తెరపైకి రానున్నాయి.2019 ఎన్నికల సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని వైసీపీ హామీ ఇవ్వడం తెలిసిందే.
ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రత్యేకమైన దృష్టి సారించింది.ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో రంగం సిద్ధం చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్ నియోజక వర్గాలు ఉన్నాయి.కాగా అరకు పార్లమెంట్ నియోజకవర్గం విస్తీర్ణం దృష్ట్యా రెండు జిల్లాలుగా.
అరకు ఏర్పాటు కానుంది.దీంతో మొత్తం రాష్ట్రంలో 26 జిల్లాలు రూపుదిద్దుకోనున్నాయి.