రాజన్న సిరిసిల్ల జిల్లా: కారు గుర్తుకు ఓటేసి వేములవాడ బిఆరెస్ పార్టీ అభ్యర్థి చల్మేడ లక్ష్మినారసింహారావు ను ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరుతూ రుద్రoగి మండల బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆరెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా ప్రజలకు సేవ చేయడానికి చల్మేడ లక్ష్మినారసింహారావు ముందుకు వస్తున్నారని అన్నారు.
కరోన కష్టకాలంలో ప్రజలకు ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు.
ప్రతిపక్ష నాయకులు లోకల్ నాన్ లోకల్ ప్రస్తావన తెస్తున్నారని చల్మేడ కూడా ఈ నియోజకవర్గ ముద్దు బిడ్డ అని అన్నారు.
సొంత ఊరిలో బడి గుడి నిర్మించారని ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నారని అన్నారు.రాష్ట్రన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తున్న బిఆరెస్ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రి ని చేసే విదంగా ప్రజలు ఆలోచించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ,జడ్పీటీసీ గట్ల మీణయ్య , గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్,నాయకులు ఉప్పులూటీ గణేష్,దయ్యాల నారాయణ,దాసరి గంగరాజం,మంచే రాజేశం,బోయిని చంద్రయ్య,కంటే రెడ్డి,మాడిశెట్టి ఆనందం తదితరులు పాల్గొన్నారు.