రాజన్న ఆలయంలో వినాయక నవరాత్రులు సందర్భంగా పూర్ణాహుతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి మహాభిషేకం, శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి.

 Purnahuti On The Occasion Of Vinayaka Navratri At Rajanna Temple , Vinayaka Navr-TeluguStop.com

ఈరోజు ఉదయం నాగిరెడ్డి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి నమిలకొండ ఉమేష్ శర్మ, ఏ.ఈ.ఓ.శ్రీనివాస్, సూపర్డెంట్ తిరుపతిరావు, రాజేందర్, ఆలయ అర్చకుల తోపాటుగా రాజన్న జిల్లా భాజపా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు.సాయంత్రం విగ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద సేవపై వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి, పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించిన తర్వాత ఆలయ ధర్మగుండంలో నిమజ్జనం చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube